Moviesతారకరత్న మృతితో నందమూరి హీరో సంచలన నిర్ణయం.. శభాష్ బాలయ్య..!!

తారకరత్న మృతితో నందమూరి హీరో సంచలన నిర్ణయం.. శభాష్ బాలయ్య..!!

టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణించిన విషయం తెలిసిందే. గత 23 రోజులుగా మరణంతో సుదీర్ఘ పోరాటం చేసిన ఆయన ఆ పోరాటంలో ఓడిపోయి తన తుది శ్వాసను విడిచారు . మొన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ఆయన చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు . ఈ క్రమంలోని సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది . ఈ విషాద వార్తతో నందమూరి ఫ్యాన్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

మరీ ముఖ్యంగా తారకరత్న వైఫ్ అలేఖ్య రెడ్డిని ఆపడం ఎవరి తరం కావడం లేదు ..ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త ఇక తన ముందు లేడు అంటూ తారకరత్న పార్ధివ దేహం వద్ద ఆమె విలపిస్తున్న దృశ్యాలు ప్రతి మనిషిని కన్నీటి పర్యంతం చేస్తున్నాయి . ఈ క్రమంలోనే తారకరత్న ఫ్యామిలీ విషయంలో నందమూరి బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు . మనకు తెలిసిందే కులాంతర వివాహం చేసుకున్నారని నందమూరి తారకరత్న ని నందమూరి ఫ్యామిలీ వెలివేసింది .

కాగా ఇలాంటి కష్ట సమయంలో బాలకృష్ణ వాటిని పట్టించుకోకుండా .. తారకరత్న ముగ్గురు పిల్లల బాధ్యతలు తానే చూసుకుంటానని చెప్పుకొచ్చారట . తారకరత్న మరణంతో ఆయన ముగ్గురు పిల్లలు తండ్రి లేనివారయ్యారు. నిషిక పెద్దమ్మాయి. తనయ్ రాయ్, రేయా ట్విన్స్. వీరిలో ఒకరు అబ్బాయి, మరొకరు అమ్మాయి. తారకరత్న పిల్లల విషయంలో బాలకృష్ణ అనూహ్య నిర్ణయం తీసుకున్నారట. ఇకపై వారి బాధ్యత ఆయనదే నట. ముగ్గురు పిల్లల బాధ్యతలను బాలకృష్ణ ఇకపై చూసుకుంటారట వాళ్ళ చదువులు భవిష్యత్తులో సెటిల్ అవ్వడం పెళ్లి చేయడం వరకు అన్ని బాలకృష్ణని దగ్గర నుండి చూసుకుంటారట . ఈ క్రమంలోని నందమూరి ఫ్యాన్స్ బాలయ్య తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. శభాష్ బాలయ్య అంటూ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news