Moviesఇది బాల‌య్య ద‌మ్ము.. న‌ట‌సింహం గ‌ర్జ‌న‌.. అన్‌స్టాప‌బుల్ 2 మైండ్‌బ్లాక్ అయ్యే...

ఇది బాల‌య్య ద‌మ్ము.. న‌ట‌సింహం గ‌ర్జ‌న‌.. అన్‌స్టాప‌బుల్ 2 మైండ్‌బ్లాక్ అయ్యే రికార్డ్ కొట్టేసిందిగా..!

నందమూరి నరసింహ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అనాస్టాపుల్ సీజన్ 2 సక్సెస్ఫుల్గా దూసుకుపోతోంది. అన్‌స్టాపుబుల్ సీజన్ 1 ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో చూసాం. దీనికి కొనసాగింపుగా తాజాగా స్ట్రీమింగ్ అవుతున్న సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ పెద్ద సంచలనం రేపింది. ఈ ఎపిసోడ్ కు బాలయ్య బావ, వియ్యంకుడు అయిన‌ టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో పాటు బాలయ్య అల్లుడు, నారా లోకేష్ వచ్చారు. ఈ షోలో బాలయ్య తనదైన శైలితో చమత్కారంతో పాటు పంచ్‌లు విసురుతూ షోకు గెస్టులుగా వచ్చిన వారిని సరదాగా ఆటపట్టిస్తూ రంజుగా ర‌క్తికట్టిస్తున్నారు. దీంతో అన్‌స్టాప‌బుల్‌ కుర్రకారుకు కూడా ఈ షో బాగా కనెక్ట్ అవుతోంది.

సీజన్ 2లో చంద్రబాబు, లోకేష్ ఎపిసోడ్ బాగా సక్సెస్ అయింది. ఆహా షోకు అదిరిపోయే రేంజ్‌లో సబ్‌స్క్రైబ‌ర్స్ కూడా వచ్చారు. ఆ తర్వాత రెండు, మూడు ఎపిసోడ్లు రెండు కూడా టాలీవుడ్ యంగ్ హీరోలతో రెత్తి కట్టించాడు. అయితే నాలుగో ఎపిసోడ్ కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి – మాజీ స్పీకర్ సురేష్ రెడ్డితో పాటు సీనియర్ నటీమణి రాధిక వచ్చారు. ఈ ఎపిసోడ్ అనుకున్న స్థాయిలో పేలలేదన్న చర్చ అయితే వచ్చింది.

అయితే ఐదో ఎపిసోడ్ ఆహా మేక‌ర్స్ చక్కగా ప్లాన్ చేశారు. టాలీవుడ్ లో టాప్ నిర్మాతలుగా ఉన్న అల్లు అరవింద్, సురేష్ బాబుతో పాటు ఇద్దరు సీనియర్ దర్శకులు కే రాఘవేంద్రరావు – కోదండరామిరెడ్డిని గెస్టులుగా తీసుకువచ్చారు. ఈ నలుగురుతో బాలయ్య షోను రఫ్ఫాడించేసాడు. రాఘవేంద్రరావు – కోదండరామిరెడ్డి ఇద్దరు బాలయ్యతో ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించారు. 90వ దశంలో వీరు టాప్ దర్శకులుగా ఉన్నారు. బాలయ్య కూడా 90 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ఆసక్తికర అంశాలు వీరితో చర్చించారు.

అలాగే అల్లు అరవింద్, సురేష్ బాబు థియేటర్ల గుత్తాధిపత్యంపై కూడా ప్రశ్నలు వేయడంతో పాటు సంక్రాంతికి వస్తున్న నా వేరసింహారెడ్డి సినిమాకు ఎన్ని ? థియేటర్లు ఇస్తున్నారంటూ కౌంటర్ కూడా ఇచ్చాడు. ఇవన్నీ బాగా పేలాయి. ముఖ్యంగా అరవింద్‌, సురేష్ బాబు నెపోటిజం గురించి బాలయ్య డైరెక్టుగా ప్రశ్నించడంతో వాళ్లు కూడా అవాక్కయ్యారు. ఇక రాఘవేంద్రరావును హీరోయిన్ల నాభిపై పూలు, పళ్ళు ఎందుకు పోస్తారు చెప్పాలని అడిగాడు. ఈ ఎపిసోడ్ అంతా చాలా సరదా సరదాగా సాగింది.

అందుకే ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎపిసోడ్ కు కేవలం రెండు రోజుల్లోనే ఏకంగా 30 మిలియన్స్ స్ట్రీమింగ్ వచ్చినట్టు ఆహా అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల్లో ఈ రేంజ్ లో స్ట్రీమింగ్స్ అంటే బాలయ్య దుమ్ము రేపేసాడనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ బాగా సక్సెస్ కావడంతో అన్‌స్టాప‌బుల్‌కు ముందు రెండో సీజన్లో తర్వాత వచ్చే ఎపిసోడ్ల‌ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తర్వాత ఎపిసోడ్ ను ప్రభాస్ – గోపీచంద్‌తో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సీనియర్ నటిమణులు జయసుధ, జయప్రద తో కూడా ఒక ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభాస్ – గోపీచంద్ ఎపిసోడ్ కచ్చితంగా సరికొత్త రికార్డులు బద్దలు కొడుతుందన్న భారీ అంచనాలు ఇప్పటికే ఉన్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news