Moviesనువ్వు అండ‌ర్‌వేర్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయావా దేవిశ్రీ... వామ్మో ఏంటీ ఈ దారుణం...!

నువ్వు అండ‌ర్‌వేర్ వేసుకోవ‌డం మ‌ర్చిపోయావా దేవిశ్రీ… వామ్మో ఏంటీ ఈ దారుణం…!

సంక్రాంతి రేసులో ఉన్న రెండు పెద్ద సినిమాలు వాల్తేరు వీర‌య్య‌, వీర‌సింహారెడ్డి ఫ‌స్ట్ సింగిల్స్ వ‌చ్చేశాయి. అంచ‌నాలు అందుకోవ‌డంలో రెండు ఓ మెట్టు కిందే ఉన్నాయంటున్నారు. ఇక ఫ్యాన్స్‌కు మాత్రం ఈ రెండు సాంగ్స్ ఎలాగూ పిచ్చ‌గానే న‌చ్చేస్తాయి. అటు దేవిశ్రీ, ఇటు థ‌మ‌న్ ఇద్ద‌రి మీదా గ‌త కొన్నేళ్లుగా కాపీ మ‌ర‌క‌లు బాగా ఎక్కువుగా ఉన్నాయి.

ఇక ఈ ఇద్ద‌రు సంగీత ద‌ర్శ‌కులు ఇద్ద‌రు పెద్ద హీరోల‌కు మ్యూజిక్ ఇచ్చిన ప్రెస్టేజియ‌స్ సినిమాలు రెండూ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. రెండిటిమీ ర‌క‌ర‌కాల ట్రోలింగ్ న‌డుస్తోంది. అయితే థ‌మ‌న్ ఇచ్చిన జై బాల‌య్య సాంగ్ కంటే దేవి ఇచ్చిన బాస్ పార్టీ మీదే ఎక్కువ ట్రోలింగ్ జ‌రుగుతోంది. బాస్ పార్టీ గురించి ఫ్యాన్స్ ఎంత ర‌చ్చ చేస్తున్నారో దాదాపు అంతే స్థాయిలో యాంటీ ఫ్యాన్స్‌తో పాటు న్యూట్ర‌ల్ ఫ్యాన్స్ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు.

ఇక బాస్ పార్టీ సాంగ్ త‌మిళంలో శింబు న‌టించిన ఓ సినిమాలోని వేర్ ఈజ్‌ద పార్టీ సాంగ్‌ను అచ్చు గుద్దిన‌ట్టే ఉందంటున్నారు. ఇక దేవీ ఈ పాట రాయ‌డంతో పాటు ట్యూన్ కూడా క‌ట్టేశాడు. ఇక సాంగ్‌లో ప‌దాలు చూస్తే నువ్వు లుంగీ ఏస్కో.. క‌ర్చిఫ్ క‌ట్టుకో.. బాస్ వ‌స్తుండు అంటూ డీఎస్పీ అరుపులు మెగా వీరాభిమానుల‌కే న‌చ్చ‌ట్లేదు. అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు డీఎస్పీని ఓ ఆటాడుకుంటున్నారు.

డీఎస్పీ ముందు నువ్వు అండ‌ర్ వేర్.. వేయ‌డం మ‌రిచిపోయిన‌ట్టున్నావ్ అన్న పంచ్‌ల‌తో ఆడేసుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో ఇంత‌కు మించిన దారుణ‌మైన ప‌దాల‌తో ఈ పాట‌పై ట్రోలింగ్ న‌డుస్తోంది. ఈ ట్రోలింగ్‌లో కూడా ముఖ్యంగా డీఎస్పీనే టార్గెట్ చేస్తున్నారు. ఏదేమైనా డీఎస్పీ ఈ సాంగ్‌తో ఆల్‌రౌండ‌ర్ అయిపోయి మంచి పేరు తెచ్చుకోవాల‌ని ఫీలైన‌ట్టున్నాడేమో గాని.. మీమ్స్ పేజీల‌కు మంచి కంటెంట్ ఇచ్చాడ‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news