Moviesకృష్ణం రాజు మరణం..రెబల్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన స్టార్ పొలిటీషియన్..!?

కృష్ణం రాజు మరణం..రెబల్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన స్టార్ పొలిటీషియన్..!?

మనిషి చనిపోయాక పక్క వాళ్ళ బుద్ధులు బయట పడుతాయి అని మన పెద్దవాళ్ళు అంటుంటారు. బహుశా అదే ఈ విషయంలో నిజమే అనిపిస్తుంది. ప్రజెంట్ రెబెల్ ఫ్యామిలీ అదే చిక్కుల్లో చిక్కుకుంది .మనకు తెలిసిందే టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు కొన్ని రోజుల ముందు మరణించారు . పోస్ట్ కోవిడ్ లక్షణాల కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హాస్పిటల్లో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటుండగానే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ ఊహించని షాకింగ్ వార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. స్టార్స్, రాజకీయ నాయకులు, ఆయనతో కలిసి పనిచేసిన నటులు ఆయనతో తన తమ రిలేషన్షిప్ ఎలా ఉండేదో గుర్తుచేసుకొని బాధపడిపోయారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

అంతేకాదు కృష్ణం రాజు మరణం తర్వాత ఆయనకు సంబంధించిన ప్రతి పనులను ప్రభాస్ సినిమా షూటింగ్ ఆపేసి మరి దగ్గరుండి చూసుకున్నారట . మొగల్తూరులో ఆయన సంస్మరణ సభకు ప్రతి రూపాయి ప్రభాస్ తన కష్టంతో సంపాదించిన డబ్బులనే ఖర్చు చేశారట. ఈ విధంగా పెద్దనాన్న రుణం తీర్చుకున్నాను అనే ఫిలింగ్ తనకు ఉండాలని చెప్పి ప్రభాస్ ఇలా చేశాడట. అయితే రెబెల్ ఫ్యామిలీకి దగ్గరగా ఉండే స్టార్ టాప్ పొలిటీషియన్ కృష్ణంరాజు మరణం తర్వాత ఆయన కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నాడని సినీ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ మారింది.

రెబల్ ఫ్యామిలీకి ముందు నుండి చాలా క్లోజ్ గా ఉండే ఈ పొలిటీషియన్ ప్రభాస్ కు కృష్ణంరాజు ఫ్యామిలీ కు మధ్య ఆస్తి తగాదాలు పెడుతున్నాడని ఓ న్యూస్ సంచలనంగా మారింది .ఈ క్రమంలోనే కృష్ణం రాజు కూతుర్లను ప్రభాస్ ను నిలదీసే విధంగా రెచ్చగొడుతున్నారట. “ప్రభాస్ కు మీతో సంబంధం లేదు.. మీ ఆస్తి మొత్తం తీసుకోవడానికి ఇలా ఉంటున్నాడు ” అంటూ కావాలనే ప్రభాస్ ని బ్యాడ్ చేస్తూ రెబెల్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టడానికి ట్రై చేస్తున్నారట. దీంతో రెబల్ ఫ్యాన్స్ ఆయనపై మండిపడుతున్నాడు . “నీ పని నువ్వు చూసుకో రా అంటూ బూతులు తిడుతున్నారు”. అంతే కాదు ప్రభాస్ కి మేమున్నాం తండ్రి లేకపోయినా ..తండ్రి లాంటి పెదనాన్న లేకపోయినా.. ఫాన్స్ గా మేము అండగా ఎప్పుడూ ఉంటాం అంటూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news