Moviesపెదనాన్న మరణం తరువాత ఫస్ట్ టైం సోషల్ మీడియా లో అలాంటి...

పెదనాన్న మరణం తరువాత ఫస్ట్ టైం సోషల్ మీడియా లో అలాంటి పోస్ట్ పెట్టిన ప్రభాస్..ఫ్యాన్స్ కన్నీళ్ళు..!!

టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణంరాజు ..గత కొన్ని రోజుల ముందు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణించి చాలా రోజులు కావస్తున్న ఇప్పటికీ ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు . మరీ ముఖ్యంగా ప్రభాస్ ఐతే ఇంకా పెదనాన్న చనిపోయిన బాధలోనే ఉంటున్నారు. అయినా కానీ తాను నమ్ముకున్న డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదని రీసెంట్ గానే సల్లార్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు.

అయితే ప్రభాస్ కృష్ణంరాజు ని ఎంత ఆరాధిస్తారో ..గౌరవిస్తారు తెలియజేసేలా ఫ్యాన్స్ ఓ వీడియోని క్రియేట్ చేశారు.నిజానికి కృష్ణంరాజు మరణించిన తర్వాత ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో బోలెడన్ని వైరల్ అయ్యాయి. కానీ అందరికీ నచ్చిన ఏకైక వీడియో ఇదే . ఈ వీడియోని సోషల్ మీడియాలో కృష్ణంరాజు మరణించిన తర్వాత ఫస్ట్ టైం అధికారిక ఖాతాలో షేర్ చేశారు ప్రభాస్. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది .

అంతేకాదు ఈ వీడియోని చూసిన ఎవ్వరైనా సరే ఎమోషనల్ గా ఫీల్ అవ్వక తప్పదు. ఈ వీడియోలో ప్రతి కృష్ణంరాజు సీన్ కి ప్రభాస్ సీన్ మ్యాచ్ చేస్తూ దానికి తగ్గ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తూ రెబెల్ అభిమానులు సూపర్ వీడియోని క్రియేట్ చేశారు. దీంతో ప్రభాస్ ఈ వీడియోని షేర్ చేస్తూ అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. ఓ హార్డ్ సింబల్ ఓ దండం పెడుతున్న ఎమోజిని షేర్ చేసి అభిమానులు పట్ల తనకున్న గౌరవాన్ని మరోసారి రుజువు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Prabhas (@actorprabhas)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news