Moviesకృష్ణం రాజు మరణం తరువాత అనుష్క చేసిన పనికి ప్రభాస్ ఎమోషనల్..ప్రేమ...

కృష్ణం రాజు మరణం తరువాత అనుష్క చేసిన పనికి ప్రభాస్ ఎమోషనల్..ప్రేమ అంటే ఇదేగా డార్లింగ్..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వైరల్ గా మారుతున్న ఓ రూమర్ ప్రభాస్ హీరోయిన్ అనుష్క ప్రేమ వ్యవహారం . వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందో లేదో అయితే తెలియదు కానీ.. జనాలు మాత్రం మీ మధ్య ప్రేమ ఉంది.. మీరు ప్రేమించుకుంటున్నారు ..మీకు తెలియట్లేదు ఆ విషయం.. మీరు పెళ్లి చేసుకోండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని గత కొన్ని సంవత్సరాలుగా మనం వింటూనే ఉన్నాం. కాగా దానికి ఆజ్యం పోస్తున్నట్లు ఉంది ప్రభాస్ అనుష్క బిహేవియర్.

మనకు తెలిసిందే రీసెంట్గా టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణం రాజు మరణించిన సంగతి. ఈ విషాద మరణ వార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయనతో కలిసి పని చేసిన రాజకీయ నాయకులు కలిసి నటించిన హీరో హీరోయిన్లు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు . మరీ ముఖ్యంగా ప్రభాస్ పెదనాన్న మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు .ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న కృష్ణం రాజు మరణించడంతో ఇప్పుడు ప్రభాస్ పెద్దదిక్కయ్యాడు.

కాగా, కృష్ణంరాజు హెల్త్ కండిషన్ బాగోలేనప్పటి నుంచి అనుష్క ఆయనను దగ్గరుండి చూసుకుంటుందట. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .అయితే కృష్ణంరాజు మరణించిన తర్వాత అనుష్క చేసిన పనికి ప్రభాస్ బాగా ఎమోషనల్ అయ్యాడు అంటూ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కృష్ణంరాజు మరణించినప్పటి నుంచి అనుష్క వాళ్ళ పెద్దమ్మ శ్యామలాదేవికి దగ్గరగా ఉంటూ ఆమెమైండ్ ని స్టేబుల్ కండిషన్ కి తీసుకొస్తుందట.

అంతేకాదు ప్రభాస్ చెల్లెలితో కూడా అనుష్క చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంది . దీంతో పెళ్లి చేసుకోకుండానే ప్రభాస్ భార్యగా అనుష్క శ్యామలాదేవి బాగోగులు చూసుకోవడం సంచలనంగా మారింది . అంతే కాదు రెబల్ అభిమానులు దీనిని చూపిస్తూ ఇదే ప్రేమంటారు డార్లింగ్ ..మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి అనుష్క ప్రభాస్ ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news