Moviesవావ్: కని విని ఎరుగని కొత్త కాంబో..మెగా-అక్కినేని అభిమానులకు కిక్కెక్కించే న్యూస్..!?

వావ్: కని విని ఎరుగని కొత్త కాంబో..మెగా-అక్కినేని అభిమానులకు కిక్కెక్కించే న్యూస్..!?

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో సీనియర్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి మరియు అక్కినేని నాగార్జున స్నేహ బంధం గురించి మనకు తెలిసిందే. జాన్ జిగిడి దోస్తు లు . ఈ విషయాని చాలా సార్లు ప్రూవ్ చేసారు ఈ హీరోలు. అంతెందుకు నాగ చైతన్య సినిమా ల విషయంలో చిరు హస్తం కూడా ఉందని అందరు అంటుంటారు. రీసెంట్ గా నాగచైతన్య ముఖ్య పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ డేబ్యు మూవీ లాల్ సింగ్ చద్దా ను తెలుగులో ప్రమోట్ చేయడానికి మెగాస్టార్ ముందుకు వచ్చాడు. తనదైన స్టైల్ లో ప్రమోట్ చేస్తూ నాగ చైతన్య కెరీర్ కి మంచి బూస్టప్ ఇస్తున్నారు. తన వంతు సహాయం చేస్తున్నారు.


అయితే, ఈ సారి మెగా అక్కినేని అభిమానులు పండగ చేసుకునే వార్తను అందించబోతున్నారు ఈ సీనియర్ హీరోలు. కని విని ఎరుగని కొత్త కాంబో ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రజెంట్ చిరంజీవి మలయాళం లో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సీనియర్ ద‌ర్శ‌కుడైన‌ మోహన్ రాజా డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. అయితే, తాజా సమాచారం ఏమిటంటే మోహన్ రాజా ఒక మల్టీస్టారర్ కథను చిరంజీవికి చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి మరియు రామ్ చ‌ర‌ణ్‌ కలిసి నటిస్తే బాగుంటుందని మోహన్ రాజా చెప్పారట.

ఈ కథ విన్న చిరంజీవి తనకంటే ఈ స్టోరీ నాగార్జున మరియు అఖిల్ కే బాగా సూట్ అవుతుందని..వాళ్లని అప్రోచ్ అవ్వమని డైరెక్టర్ తో చెప్పారట. నాగార్జున అఖిల్ కాంబోలో ఈ సినిమా వస్తే బాగా వర్క్ అవుట్ అవుతుందని చిరంజీవి అభిప్రాయపడ్డారట. చిరంజీవి చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఈ సందర్భంలోనే ఈ స్టోరీ మీద హోఫ్స్ పెట్టుకోకుండా ..తన ఫ్రెండ్ అయిన నాగార్జున ని ఆయన కొడుకు అఖిల్ ను సంప్రదించమని చెప్పినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కి వాళ్ళు యస్ చెప్పితే చిరంజీవినే ప్రొడ్యూస్ చేస్తారట. నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ కూడా సహ నిర్మాతలుగా ఉండే అవకాశం కూడా ఉంది. అయితే మోహన్ రాజా ఈ కథతో నాగార్జున అఖిలను ఎంతవరకు మెప్పిస్తారో మనం చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news