Moviesమహేష్ ఆ హీరోయిన్ నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదట..ఎందుకంటే..?

మహేష్ ఆ హీరోయిన్ నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదట..ఎందుకంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు..ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. పరశూరాం డైరెక్షన్ లో మహేశ్ హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కలెక్షన్స్ పరంగా కూడా టాప్ స్దానంలో నిలిచింది.

ప్రజెంట్ మహేశ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా..అలాగే దర్శకధీరుడు రాజమౌళి తో మరో సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. రెండు సినిమాల పై అభిమానులు భారీ స్దాయిలోనే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. SSMB28 లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా..రాజమౌళి సినిమాలో బాలీవుడ్ బ్యూటీని తీసుకోనున్నట్లు టాక్వినిపిస్తుంది.

అయితే, మహేష్ బాబు తన ఇన్నాళ్ల కెరీర్ లో ఆ హీరోయిన్ నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదట. ఈ విషయానికి ఆయనే ఓ ఇంటర్వ్యుల్లో చెప్పుకురావదం విశేషం. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఆయన భార్య..నమ్రతా శిరోద్కర్. మనకు తెలిసిందే నమ్రత మహేష్ భార్య కాకముందు సినిమాల్లో నటించేది. బాలీవుడ్ ను తన అందచందాలతో షేక్ చేసిన ఈ బ్యూటీ నటించిన సినిమాలను ఇప్పటి వరకు ఒక్కటి కూడా చూడలేదట. ఆఖరికి వీళ్ల కాంబో లో వచ్చిన వంశీ సినిమాను కూడా చూడలేదట. రీజన్ ఏంటి అని అడిగితే మాత్రం ..సైలెంట్ గా నవ్వేసి తప్పించుకునేశాడు..మహేష్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news