Moviesఎంత ధైర్యం..పబ్లిక్ గానే ఛండాలం..పరువు తీసిన పూజా హెగ్డే..!

ఎంత ధైర్యం..పబ్లిక్ గానే ఛండాలం..పరువు తీసిన పూజా హెగ్డే..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గు ఘోర అవమానం జరిగింది. ఇండిగో సిబ్బంది పూజాతో అసభ్యంగా ప్రవర్తించారని తానే స్వయంగా చెప్పుకొచ్చింది. దీంతో ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ మధ్య కాలంలో ఇలా హీరోయిన్స్ తో మిస్ బీహేవ్ చెయ్యడాలు ఎక్కువైపోయాయి. ఇప్పటికే ఇలా తమతో అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కొందరు హీరోయిన్స్ ఓపెన్ గా ఆ మ్యాటర్ ని బయట పెట్టగా..ఇప్పుడు, ఆ లిస్ట్ లోకి పూజా హెగ్డే చేరిపోయింది.


సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ బుట్టబోమ్మ..జనరల్ గా తన సినిమాలకు సంబంధించిన విషయాలను..లేటేస్ట్ ఫోటో షూట్లను మాత్రమే అభిమానులతో పంచుకుంటూ వస్తుంది . కానీ, ఈసారి తనకు జరిగిన చేదు అనుభవాని..ఫ్యాన్స్ తో పంచుకోవడం సంచలనంగా మారింది. రీసెంట్ గా పూజా ఇండిగో విమానంలో ప్రయాణించింది. ఈ క్రమంలోనే ఆ సంస్ధకు సంబంధించిన ఓ సిబ్బంది పూజా తో అసభ్యంగా ప్రవర్తించారట. దీంతో అతని పై ఫైర్ అవుతూ ఓ ట్వీట్ చేసింది.

సోషల్ మీడియా వేదికగా మండిపడుతూ..ట్వీట్ చేసింది. పూజా రాసుకొస్తూ..”ఇండిగో విమానయాన సంస్ధకు చెందిన స్టాఫ్ మెంబర్ విపుల్ నకాషే అనే వ్యక్తి నాతో బ్యాడ్ గా బీహేవ్ చేశాడు. ముంబై నుంచి బయలుదేరిన మా విమానంలో మాతో అనుచితంగా ప్రవర్తించాడు. రీజన్ ఏం లేకుండానే.. మాతో ఫుల్ రూడ్ గా మాట్లాడాడు.. బెదిరింపు టోన్‌లో మాట్లాడాడు.

సాధారణంగా ఇలాంటి విషయాల గురించి ట్వీట్‌ చేయనని కానీ ఈరోజు అతడి ప్రవర్తనతో చాలా భయమేసింది అందుకే మీతో చెప్పుతున్నాను” అంటూ రాసుకొచ్చింది పూజా. పూజా చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవ్వగా.. దీనిపై ఇండిగో యాజమాన్యం స్పందిస్తూ సదరు హీరోయిన్‌కు క్షమాపణలు చెప్పింది. వెంటనే చర్యలు తీసుకుంటామని.. పీఎన్ఆర్ నంబరు, కాంటాక్ట్ నంబరు మెసెజ్ చేయాలని కోరింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news