Moviesకియారా బ్యూటీ కి ఆ డైరెక్టర్ మైండ్ బ్లాకింగ్ ఆఫర్..స్టార్ హీరోతో...

కియారా బ్యూటీ కి ఆ డైరెక్టర్ మైండ్ బ్లాకింగ్ ఆఫర్..స్టార్ హీరోతో కోలీవుడ్ ఎంట్రీ..?

కియారా అద్వానీ..ఈ మధ్య కాలంలో తెలుగు, హీందిలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్న పేరు. బాలీవుడ్ లో తన అందం తో నటన తో జనాలని మెప్పించి..ఆ పాపులారిటితో ..తెలుగులో ను స్టార్ హీరో మహేశ్ బాబు సరసన చేసే ఛాన్స్ కొట్టేసింది. కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను.. సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ..ఆ సినిమాతో మంచి వీజ్యాని తన ఖాతాలో వేసుకుంది. కేవలం తన సైలెంట్ లుక్స్ తోనే డైరెక్టర్లను మాయ చేస్తుంది ఈ బ్యూటి అనే పేరు ఇండస్ట్రీలో ఉంది.

ఇక ఆ త‌ర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో వినయ విధేయ రామ అనే చిత్రంలోను అవకాశం అందుకుని.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించింది. కానీ, ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది. దీంతో అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఆ సినిమా తరువాత అమ్మడు తెలుగులో కనిపించడమే మానేసింది. ఇదిగో ఇప్పుడు మళ్ళీ చరణ్ తో మరోసారి తన లక్ ను పరిక్షించేందుకు RC15 సినిమా తో రాబోతుంది. 60 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా లో కియారా ఎప్పుడు చేయనటువంటి రోల్ లో కనిపిస్తుందనే టాక్ బయటకు వచ్చింది.

కాగా, ఓ వైపు బాలీవుడ్ లోను మంచి మంచి అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ..ఇప్పుడు తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ లు అందుకుంటుంది. ఇప్పుడు తాజాగా అమ్మదు కోలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన్నట్లు తెలిసింది. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌ హీరోగా మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుందన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోహీరోయిన్‌ పాత్రకు కియారా అద్వానీ సెలక్ట్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించి..స్టోరీ కూడా చెప్పారట. కథ బాగా నచ్చేయడంతో అమ్మడు కాల్ షీట్లు లేకున్న అడ్జెస్ట్ చేసి..మరీ సినిమాకు సైన్ చేసిందట. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news