Moviesవావ్‌: మ‌హేష్ - ఎన్టీఆర్ 7 - 29 సినిమాలు సేమ్...

వావ్‌: మ‌హేష్ – ఎన్టీఆర్ 7 – 29 సినిమాలు సేమ్ టు సేమ్‌…!

టాలీవుడ్ స్టార్ హీరోలు మ‌హేష్‌బాబు – ప‌వ‌న్ క‌ళ్యాణ్ – జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు హీరోల 7వ సినిమాలో ఓ కామ‌న్ పాయింట్ ఉంది. వీళ్ల కెరీర్‌లో మూడో సినిమాలుగా వ‌చ్చిన ఒక్క‌డు – ఖుషీ – సింహాద్రి మూడూ కూడా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు అయ్యాయి. ఈ మూడు సినిమాల్లోనూ హీరోయిన్‌గా భూమిక న‌టించింది. ఖుషీ 2001లో రిలీజ్ అయితే, 2003లో సింహాద్రి, ఒక్క‌డు సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈ విష‌యంలో అప్ప‌ట్లో ట్రెండింగ్ అవ్వ‌డంతో పాటు భూమిక చాలా ల‌క్కీ హీరోయిన్ అని అనుకునేవారు. ఇది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నాటి మాట‌. మ‌ళ్లీ అలాంటి కామ‌న్ విష‌యాలు జ‌ర‌గ‌లేదు. అయితే చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ ఇప్పుడు అలాంటి సంఘ‌ట‌నే టాలీవుడ్‌లో జ‌రుగుతోంది. ఎన్టీఆర్ న‌టించిన 29వ సినిమాకు రాజ‌మ‌ళి ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. త్రిబుల్ ఆర్‌గా వ‌చ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్లో సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది.

ఎన్టీఆర్ 29వ సినిమా మాదిరిగానే ఇప్పుడు మ‌హేష్‌బాబు 29వ సినిమాకు కూడా రాజ‌మౌళీయే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాజాగా త‌న కెరీర్‌లో 27వ సినిమాతో స‌ర్కారు వారి పాట‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ 28వ సినిమాను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఇక త‌న 29వ సినిమాను రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేయ‌డం దాదాపు ఖ‌రారైంది. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై డాక్ట‌ర్ కేఎల్‌. నారాయ‌ణ నిర్మిస్తున్నారు.

మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా ముగిసిన వెంట‌నే రాజ‌మౌళి సినిమా ప‌ట్టాలు ఎక్కుతుంది. త్రిబుల్ ఆర్ స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న రాజ‌మౌళి.. మ‌హేష్ సినిమా కోసం త్వ‌ర‌లోనే వ‌ర్క్ స్టార్ట్ చేస్తాడు. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ టీం – రాజ‌మౌళి క‌లిసి ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో అడ్వంచ‌ర్ థ్రిల్ల‌ర్ స్టోరీని రెడీ చేస్తున్నారు. ఈ యేడాది చివ‌రి నాటికి రాజ‌మౌళి – మ‌హేష్ సినిమా ప‌ట్టాలు ఎక్కే అవ‌కాశాలు ఉన్నాయి.

గ‌తంలో 7వ సినిమా సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యి.. ముగ్గురు హీరోలు హిట్లు కొట్టారు. ఇప్పుడు 29వ సినిమా సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యి మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో సూప‌ర్ హిట్ అవుతుందేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news