Moviesఆ పనికిమాలిన సినిమాలు ఎందుకయ్యా..? సంచలనంగా మారిన హీరో మాటలు ..!!

ఆ పనికిమాలిన సినిమాలు ఎందుకయ్యా..? సంచలనంగా మారిన హీరో మాటలు ..!!

టాలీవుడ్ లో హీరో గా తన లక్ పరిక్షించుకోడానికి వచ్చి ఫెయిల్ అయ్యి..ఇప్పుడు ఇండస్ట్రీకే దూరంగా ఉన్నారు ఒకప్పటి హీరో రాజా. చేసింది కొన్ని సినిమాలే అయినా..నటన పరంగా బాగానే మెప్పించాడు . ‘ఆనంద్’ సినిమా తన కెరీర్ కే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆయన నటనకి విమర్శకుల నుండి కూడా ప్రశంసలు దక్కించుకున్నారు. అలాగే ఆ నలుగురు చిత్రం లో కూడా రాజా నటన చాలా అధ్బుతంగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి హిట్స్ పడిన ఈ హీరో ఇప్పుడు ఇండస్ట్రీ లో అడ్రెస్ లేడు. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

అయితే, సినిమాలు తగ్గిపోయాక రాజా.. క్రిస్టియానిటీ వైపు అట్రాక్ట్ అయ్యి అక్కడ స్పిరుచువల్ స్పీకర్ గా మారిపోయాడు . తన ఉపన్యాసాల తో జనాలను ఇట్టే మాయ చేసేస్తాడు అంటారు ఈ స్పీచ్ విన్న వాళ్ళు. ఒక్కసారి యూట్యూబ్‌లోకి వెళ్లి రాజా స్పీచ్‌లు వింటే..మీ కళ్ళని మీరే నమ్మలేరు. ఏంటీ ..ఈయన మన హీరో రాజా నా అని షాక్ అవ్వడం ఖాయం. అంతలా మారిపోయాదు రాజా. కొందరు అయితే ఎందుకు రాజా ఇలా అయిపోయాడు అంటూ ఆయన వీడియో ల క్రింద కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే, ఈయన వీడియో ఒకటి నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

మొదట్లో సినిమాలు అంటే ఇష్టం ..అందుకే ఇండస్ట్రీలోకి వచ్చ అని చెప్పిన ఈ నటుడే.. ఇప్పుడు ఎందుకయ్యా..ఈ పనికిమాలిన సినిమాలు అనడం పెద్ద దుమారమే రేపుతుంది. ఆయన స్పీచ్ లో భాగంగా మాట్లాడుతూ ..” శుక్రవారం వచ్చింది. మార్నింగ్ షో.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి చూడాలి అని  లైన్లో నిల్చోని..వెళ్లి మూడు గంటలు టైం వేస్త్ చేసుకుని సినిమాలు చూస్తారు. దానికి బదులు మీ విలువైన టైం ని మీ అమ్మ నాన్నలతో..లేదా అక్క చెల్లెలతో గడపండి.

ఆ పనికి మాలిన సినిమాలు చూడటం వల్ల మీకు ఏ లాభమూ లేదయ్యా.. ’’ అంటూ సాగిన రాజా స్పీచ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీని పై సిని ప్రముఖులు సైతం మండి పడుతున్నారు . సినీ రంగం నుంచి వెళ్లి సినిమాల గురించి ఇంత చీప్ గా మాట్లాడటంపై రాజాను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కొందరు రాజా ని మతం పేరుతో ఎక్కువుగా టార్గెట్ చేసి బ్యాక్ ఫైర్ చేస్తున్నారు. మరి చూడాలి తన మాటల పై రాజా ఎలాంటి వివరణ ఇస్తాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news