Moviesఆ సీన్ చేయను అని ఏడ్చేసిన అనుష్క..ఎందుకంటే..?

ఆ సీన్ చేయను అని ఏడ్చేసిన అనుష్క..ఎందుకంటే..?

అనుష్క శెట్టి.. ఈ పేరు అంటే పడి చచ్చి పోయే జనాలు ఇంకా ఉన్నారు అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆమె సినిమా చాలా తక్కువగా కమిట్ అవుతుంది. స్టార్ హీరోలతో సినిమా అవకాశాలు రావడం లేదు. సోషల్ మీడియా కు దూరంగా ఉంటుంది. బయట ఫంక్షన్ లకి రాదు. బయట కనిపించి చాలా కాలమే అవుతుంది. నవీన్ పోలిశెట్టితో ఒక్క సినిమా తప్పిస్తే అనుష్క చెప్పుకోతగ్గిన సినిమాలు ఏం చేయడం లేదు. కానీ, అమ్మడు క్రేజ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. అనుష్క అంటే జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

దానికి కారణం లేకపోనూ లేదు. అందరు హీరోయిన్స్ ఎక్స్ పోజింగ్ చేస్తారు. బయట కూడా అలాంటి దుస్తులే వేసుకుని తిరుగుతుంటారు. కానీ, అనుష్క అలా కాదు..సినిమాలో పాత్ర కోసం ఆమె ఎలాంటి పాత్రలు నటించినా..బయట మాత్రం చాలా పద్ధతిగా చీరు, చుడిదార్ లు వేసుకుంటుంది. అంతేకాదు, ఎటువంటి కాంట్ర వర్సీలకు పోదు. తన పని తాను చూసుకుని వెళ్లిపోతుంది. మరీ ముఖ్యంగా అనుష్క పెద్దల పట్ల చూపే గౌరవం అంటే అభిమానులకు చాలా ఇష్టం. కాగా, తన సినీ కెరీర్ లో ఎన్నో పాత్రలు చేసి..అభిమానులను మెప్పించిన అనుష్క..ఒక్క సీన్ చేయడానికి మాత్రం భయపడిందట.

అనుష్క తన కెరీర్ స్టార్టింగ్ లో జగపతి బాబు తో కలిసి స్వాగతం అనే సినిమాలో అంటించింది. ఈ సినిమా ని దశరధ్ డైరెక్ట్ చెశారు. ఈ సినిమాలో హీరోయిన్లు గా అనుష్క, భూమిక నటించారు. ఈ సినిమాలో భూమిక జగపతి బాబు భార్య భర్తలు గా నటిస్తారు.. భూమిక ఓ జబ్బు వళ్ల చనిపోతుంది. ఈ క్రమంలోనే అనుష్క జగపతి బాబుని ప్రేమిస్తుంది.. దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తుంటుంది.

ఈ క్రమంలో ఓ పాట వస్తుంది..మనసా మౌనమా అంటూ సాగే సాంగ్ రొమాంటిక్ గా ప్లాన్ చేసారు. దీనికోసం ఓ అడవి ప్రాంతంలో వాటర్ ఫాల్స్ దగ్గర కొండ పైకి ఎక్కి..అనుష్క క్రింద పడిపోవాలి..ఆ టైంలో జగపతి బాబు తన కోసం నీళల్లోకి దూకుతాడు. కానీ అనుష్క కు ఆ కొండ పై నుండి చూసిన్నప్పుడే భయం తో వణుకు వచ్చేసిందట. భయం తో ఆ సీన్ చేయను ప్లీజ్ అంటూ ఏడ్చేసిందట. దీంతో డైరెక్టర్ ఆ షాట్ మార్చి.. వాటర్ ఫాల్స్ క్రింద భాగంలోనే రొమాంటిక్ సీన్ షూట్ చేశారట. ఆ తరువాత మెల్లగా మెల్లగా అనుష్క అన్ని అలవాటు చేసుకునిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news