Moviesబాప్‌రే..కళావతి సాంగ్ కోసం అంత డబ్బులు ఖర్చు చేసారా..?

బాప్‌రే..కళావతి సాంగ్ కోసం అంత డబ్బులు ఖర్చు చేసారా..?

కమాన్ కమాన్ కళావతి నువ్వేగతే నువ్వే గతి..కమాన్ కమాన్ కళావతి నువు లేకుంటే అధోగతి..ఇప్పుడు ఎక్కడ చూసిన వరి నోట విన్నా..ఎవరి మొబైల్స్ కి కాల్ చేసి ఈ పాటనేఅ వినిపిస్తుంది. అంతలా ఈ పాట అభిమానులకు నచ్చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’లోని ‘కళావతి’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచిందన్న విషయం తెలిసిందే. మహేష్ అభిమానులు అయితే తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు పరశూరాం డైరెక్షన్ లో “సర్క్కారు వారి పాట” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తమ అభిమాన హీరోను వెండితెరపై చూడక రెండేళ్లు అవుతోన్న నేపథ్యంలో మహేష్‌ అభిమానులు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు పరశురామ్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను వాలెంటన్స్ డే సంధ్రభంగా ఒకరోజు ముందు రిలీజ్ చేసారు మేకరస్.

వందో, ఒక వెయ్యో, ఒక లక్షో మెరుపులు దూకినాయా.. ఏందే నీ మాయ.. అంటూ సాగే ఈ పాటలోని లిరిక్స్‌ సంగీతప్రియులను కట్టిపడేస్తున్నాయి. సెన్సేషనల్‌గా మారిన ఈ హిట్‌ పాటకు తమన్‌ సంగీతం అందించగా ,అనంత శ్రీరామ్ అధ్బుతమైన లిరిక్స్ ని సిద్‌ శ్రీరామ్‌ తన తీయ్యటి గొతుతో ఆలపించారు. ఇప్పటివరు ఈ సాంగ్‌కు యూట్యూబ్‌లో 29 మిలియన్ల వ్యూస్‌ రాగా ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. కేవలం అతి తక్కువ టైంలోనే ఈ పాటకి ఈ క్రేజ్ రావడం విశేషం.

తాజాగా ఈ కళావతి పాటకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను చిత్ర మేకర్స్ రిలీజ్‌ చేశారు. ఇక ఈ వీడియోలో చిత్రయూనిట్‌ తో పాట మహేశ్‌, కీర్తి సురేశ్‌ ఫన్నీ మూమెంట్స్‌ను మనం చూడవచ్చు. కాగా ఈ లిరికల్‌ సాంగ్‌ కోసం నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా..రూపాయి కూడా వెనకడుగు వేయకుండా దాదాపు రూ.60 లక్షల పైనే ఖర్చు చేసినట్లు మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా మే 12న గ్రాండ్ గా విడుదలవుతోంది.

 

 

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news