Moviesఆ నిర్మాత‌తో బాల‌య్య బిగ్‌డీల్‌.. దిల్ రాజుకు పెద్ద చిల్లు..!

ఆ నిర్మాత‌తో బాల‌య్య బిగ్‌డీల్‌.. దిల్ రాజుకు పెద్ద చిల్లు..!

అఖండ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో యాక్ష‌న్ సినిమా చేస్తున్నాడు. క్రాక్ త‌ర్వాత గోపీచంద్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇదే. #NBK107 ప్రాజెక్టుగా తెర‌కెక్కే ఈ సినిమాలో బాల‌య్య స‌ర‌స‌న శృతీహాస‌న్ హీరోయిన్‌గా కాగా.. వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కూడా మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. మైత్రీ మూవీస్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమా నిర్మిస్తోంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య‌, అనిల్ రావిపూడి ప్రాజెక్టుకు ఓకే చెప్పేశాడు.

 

క‌ళ్యాణ్‌రామ్‌తో ప‌టాస్ సినిమా చేసిన‌ప్ప‌టి నుంచి బాల‌య్య‌తో సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. మ‌ధ్య‌లో ఓ సారి రామారావు గారు అన్న టైటిల్‌తో ఓ క‌థ కూడా బాల‌య్య‌కు వినిపించాడు. అయితే ఆ లైన్ బాల‌య్య‌కు ఎందుకో న‌చ్చ‌లేదు. ఆ త‌ర్వాత రెడీ చేసిన క‌థ మాత్రం బాల‌య్య‌కు బాగా న‌చ్చేసింది. ఈ సినిమాపై ఇటీవ‌లే అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇది బాల‌య్య మార్క్‌లాగా, నా మార్క్‌లాగా కాకుండా.. ఇద్ద‌రి మార్క్ క‌లిస్తే ఎలా ? ఉంటుందో ? ఆ రేంజ్‌లో ఉంటుంద‌ని క్లారిటీ ఇచ్చారు. పైగా ఇది బాల‌య్య‌ను గ‌తంలో ఎవ్వ‌రూ చూపించ‌ని విధంగా చాలా సంచ‌ల‌నాత్మ‌క రీతిలో ఉంటుంద‌ని కూడా చెప్ప‌డంతో నంద‌మూరి అభిమానుల్లో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనిల్ రావిపూడికి, దిల్‌రాజుకు ముందు నుంచి లింక్ ఉంది. ప‌టాస్ డిస్ట్రిబ్యూట‌ర్ దిల్ రాజు. ఆ త‌ర్వాత సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 సినిమాల ప్రొడ్యుస‌ర్ కూడా దిల్ రాజే. మ‌ధ్య‌లో అనిల్‌.. మ‌హేష్‌తో చేసిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాను కూడా రాజే డిస్ట్రిబ్యూట్ చేశాడు. అలా దిల్ రాజు ఆస్థాన డైరెక్ట‌ర్‌గా ముద్ర వేయించుకున్నాడు అనిల్ రావిపూడి.

 

ఇక దిల్ రాజు కూడా బాల‌య్య‌తో ఎలాగైనా ఒక్క సినిమా అయినా చేయాల‌ని ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నాడు. బాల‌య్య‌తో ఒక్క సినిమా చేసి ఉంటే అది త‌న‌కు బంధం బ‌ల‌ప‌డ‌డంతో పాటు భ‌విష్య‌త్తులో ఏపీలో త‌న‌కు వ్యాపార‌ప‌రంగా ఏదైనా ఇబ్బంది ఉండ‌ద‌ని.. ఇటు ఇండ‌స్ట్రీలోనూ, అటు నంద‌మూరి అభిమానుల్లోనూ ప్ల‌స్ అవుతుంద‌ని ఎప్ప‌టి నుంచో లెక్క‌ల్లో ఉన్నాడు. ఇటు అనిల్ రావిపూడి ప్రాజెక్టును తానే నిర్మించేయాల‌ని చాలా లెక్క‌లు వేసుకున్నాడ‌ట‌.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు విష‌యంలో బాల‌య్య ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మించేది రాజు కాదు.. షైన్ స్క్రీన్ అధినేత‌లు సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్దిల‌తో బాల‌య్య డీల్ ఓకే చేసుకున్నాడ‌ట‌. దీంతో ఈ ప్రాజెక్టు ఇప్పుడు షైన్ స్క్రీన్ బ్యాన‌ర్‌కు వెళ్లిపోయింది. ఈ క్రేజీ ప్రాజెక్టు త‌మ చేతికి రావ‌డంతో షైన్ స్క్రీన్ వారు భారీ బ‌డ్జెట్‌తో, ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించేందుకు రెడీ అవుతున్నారు. ఏదేమైనా ఈ క్రేజీ కాంబినేష‌న్ రాజు చేజార‌డం ఆయ‌న‌కు పెద్ద షాకే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news