Moviesమ‌ళ్లీ ఎమోష‌న‌ల్ అయిన స‌మంత‌.. ఆ పోస్టులో ఏం చెప్పిందంటే..!

మ‌ళ్లీ ఎమోష‌న‌ల్ అయిన స‌మంత‌.. ఆ పోస్టులో ఏం చెప్పిందంటే..!

స‌మంత‌కు ఇండ‌స్ట్రీలో .. ఇంకా చెప్పాలంటే తెలుగులో స్నేహితురాళ్లు చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఆమె నాగ‌చైత‌న్య‌తో పెళ్లి కి ముందు నుంచే ఎక్కువ మంది స్నేహితురాళ్ల‌తో ఎంచ‌క్కా ఎంజాయ్ చేసేది. అయితే చైతును పెళ్లి చేసుకున్నాక ఆమె త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి తిర‌గ‌డం కాస్త త‌గ్గించింది. చైతుతోనే ఎక్కువ స‌మ‌యం గ‌డపాల్సి రావ‌డంతో స‌మంత‌కు స్నేహితురాళ్ల‌తో ఎంజాయ్ చేసేందుకు అంత టైం దొరికేది కాదే. అయితే ఇప్పుడు చైతుకు విడాకులు ఇచ్చేయ‌డంతో సామ్ మ‌ళ్లీ ఫ్రీ బ‌ర్డ్ అయిపోయిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

త‌న స్నేహితురాళ్ల‌తో ఎంజాయ్ చేయ‌డంతో పాటు సోష‌ల్ మీడియాలోనూ ఎక్కువుగా వారితో క‌లిసి ఉంటోన్న ఫొటోలే షేర్ చేస్తూ వ‌స్తోంది. తాజాగా స‌మంత మరోసారి త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి ఉన్న ఫొటో పోస్ట్ చేయ‌డంతో మ‌ళ్లీ ఎమోష‌న‌ల్‌గా స్పందించింది. ఆమె తాజా ఫొటోలో ప్ర‌ముఖ డాక్ట‌ర్ అనగాని మంజుల, దర్శకురాలు నందిని రెడ్డి, నటి మాళవికా నాయర్‌ ఉన్నారు. డాక్టర్ అన‌గాని మంజుల పుట్టిన రోజు సంద‌ర్భంగా వీరు ఏర్పాటు చేసుకున్న పార్టీలో వీరు క‌లుసుకున్నారు.

ఈ క్ర‌మంలోనే తీసిన ఫొటోను షేర్ చేసిన స‌మంత మీ లాంటి ఫ్రెండ్స్ నా లైఫ్‌లోకి రావ‌డం నా అదృష్టం అని పేర్కొంది. క‌ష్టాల్లో నిజ‌మైన స్నేహితుడు అంటే ఎవ‌రో తెలుస్తుంద‌ని.. నాకు మీ కంటే నిజ‌మైన మిత్రులు ఎవ్వ‌రూ లేరు.. డాక్ట‌ర్ హ్యాపీ బ‌ర్త్ డే అంటూ పోస్ట్ చేసింది. ఇక చైతుతో విడాకులు తీసుకున్నాక స‌మంత త‌న స్నేహితురాలు శిల్పా రెడ్డితో క‌లిసి తీర్థ‌యాత్ర‌ల‌కు వెళ్లి వ‌చ్చింది.

ఇక ఇప్పుడు పార్టీల‌తో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. ఇక ఇప్పుడు స‌మంత వ‌రుస పెట్టి సినిమాలు చేసేందుకు ప‌క్కా ప్లానింగ్‌తో ముందుకు వెళుతోంది.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news