Moviesఆ గొప్పతనాన్ని చెప్పే సినిమా ఇదే..చిరంజీవి కీలక వ్యాఖ్యలు..!!

ఆ గొప్పతనాన్ని చెప్పే సినిమా ఇదే..చిరంజీవి కీలక వ్యాఖ్యలు..!!

ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్య రాజు ‘నాట్యం’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. నటి గా, నిర్మాత గా, కొరియోగ్రాఫర్ గా, ప్రొడక్షన్ డిజైనర్ గా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కమల కామరాజు, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, శుభలేకా సుధాకర్ మరియు భానుప్రియ నాట్యంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘నాట్యం’ అక్టోబర్ 22 న థియేటర్‌లో విడుదల కానుంది. సంధ్య రాజు తన నిర్మాణ సంస్థ నిశ్రింకల ఫిలిమ్స్ కింద ఈ చిత్రాన్ని నిర్మించారు. రేవంత్ కోరుకొండ ఈ సినిమాతో దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్‌గా, ఎడిటర్‌గా పరిచయం అవుతున్నారు.

కాగా ‘నాట్యం’ సినిమాలకు టాప్ సెలెబ్రిటీల సపోర్ట్ బాగా లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలంతా భాగమయ్యారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘నాట్యం’ సినిమా తనకు నచ్చిందని చెబుతూ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ప్రశంసలు ఈ చిత్ర యూనిట్‌కు లభించాయి.

ఆయన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ‘సాధారణంగా ఈ తరహా చిత్రాలు అనగానే విశ్వనాథ్‌గారు గుర్తుకు వస్తారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘నాట్యం’ సినిమాను తీసినట్టు నాకు అనిపిస్తోంది అన్నారు. ఈ సినిమా ద్వారా నాట్యం గొప్పదనం కొన్ని కోట్ల మందికి చేరుతుంది. ‘శంకరాభరణం’ తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. అదే కోవలో ‘నాట్యం’ ప్రజాశీస్సులు పొందాలని కోరుకుంటున్నా’ అన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news