Moviesకెరీర్ పుంజుకుంటున్న టైంలో ఆ స్టార్ హీరో డేరింగ్ స్టెప్..మెగాస్టార్ కోసం...

కెరీర్ పుంజుకుంటున్న టైంలో ఆ స్టార్ హీరో డేరింగ్ స్టెప్..మెగాస్టార్ కోసం సంచలన నిర్ణయం.. ..?

మెగాస్టార్ చిరంజీవి.. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఆచార్య సినిమా షూటింగ్ కంప్లీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. దాని తర్వాత లూసిఫర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా చిత్రయూనిట్ మెగాస్టార్ పుట్టినరోజున టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. అలాగే అదే రోజున మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేదాళం రీమేక్ టైటిల్‏గా బోళా శంకర్ టైటిల్ ప్రకటించారు. ఈ రెండు ప్రాజెక్ట్ ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నట్లు ఇదివర్కే ప్రకటైంచారు.

అయితే ఈ సినిమాలో చిరు డ్యుయల్ రోల్ చేయనున్నారట. ఇప్పటికే పలు సినిమాల్లో డ్యుయల్ రోల్ చేసిన మెగాస్టార్ మరోసారి ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో ఓ హార్బర్‌లో నడుచుకుంటూ చిరంజీవి వస్తోన్న పోస్టర్‌ను విడుదల చేసారు. ఈ సినిమాకు ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ మూవీ.. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ కలబోతగా తెరకెక్కించనున్నాడట బాబీ. ఈ సినిమాలో చిరంజీవి తండ్రీ కొడుకుల పాత్రలో డబుల్ యాక్షన్ చేయనున్నాడట. మొత్తంగా చిరంజీవి ‘బిల్లా రంగా’, ‘ సింహపురి సింహం’, ‘రిక్షావోడు’, ‘స్నేహం కోసం’, ‘అందరివాడు’ సినిమాల్లో తండ్రీ కొడుకులుగా నటించారు. ఇపుడు మరోసారి తండ్రి కొడుకులుగా చిరంజీవి వెండితెరపై కనిపించనున్నట్లు తెలుస్తుంది.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మాస్ రాజా మహ రాజ రివ్తేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఇంటర్ వెల్ ముందు సీన్ లో ఓ నెగిటివ్ పాత్ర ఎంట్రీ ఉంటుందని..టోటల్ సినిమాకి ఈ పాత్ర ప్రాణం పోస్తుందని ..అప్పటి నుండి సినిమా సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయని ఫిల్మ్ నగర్ లో గుస్ గుస్లు వినిపిస్తున్నాయి. సో..దీని బట్టి చూస్తే మెగాస్టార్ కోసం నెగిటివ్ రోల్ చేయడానికి కూడా సిద్దమయ్యాడు రవితేజ..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news