Moviesవామ్మో..చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా..యమ రంజుగా మారిన బిగ్ బాస్ హౌస్..!!

వామ్మో..చరిత్రలోనే ఫస్ట్ టైం ఇలా..యమ రంజుగా మారిన బిగ్ బాస్ హౌస్..!!

ఎన్నో భారీ అంచనాల మధ్య 19 మంది సెలబ్రిటీలతో గ్రాండ్‌గా మొదలైన బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌.. చూస్తుండగానే షో నాలుగువారాలు పూర్తి చేసుకోగా నలుగురు హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారు. ఇక హౌస్ లోని కంటెస్టేంట్స్ మాత్రం ఎవరికి తగ్గటు వారు భారీ స్ట్రాటజీలు వేసుకుంటూ..అవసరం ఉన్నా లేకున్నా కావాలని గొడవలు వేసుకుంటూ..స్క్రీన్ స్పెస్ కోసం పాకులాడుతున్నారు.

ఇక బిగ్ బాస్ హౌస్ మిగతా రోజుల్లో ఎలా ఉన్నా కానీ..ముఖ్యంగా స్ఫ్మవారం మాత్రం యమ రంజుగా మారిపోతుంది. ఎందుకంటే..ఆ రోజు ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి కంటెస్తేఅంట్స్ ని నామినేట్ చేస్తారు. ఇక ఆ క్రమంలో మొదలైయ్యే గొడవలు..చెప్పే రీజన్స్..ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఈ వారం హౌస్ నుండి బయటకు వెళ్ళడానికి ఏకంగా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. లోబో , సన్నీ ,విశ్వ,హమీదా , మానస్ , ప్రియ , జెస్సీ ,యాంకర్ రవి , షణ్ముఖ్ జస్వంత్ నామినేట్ అయ్యారు.

రంజుగా సాగిన ఈ నామినేషన్ ప్రక్రియలో .. అత్యధికంగా షణ్ముఖ్‌ను నామినేట్‌ చేశారు. అందరికి రెండు మూడు ఓట్లతో నామినేట్ కాగా.. షణ్ముఖ్‌కి ఏకంగా 8 ఓట్లు వచ్చాయి. బిగ్ బాస్ హిస్టరీలో ఒకే వారంలో 9 మంది నామినేట్ కావడం కావడంతో పాటు.. ఒక కంటెస్టెంట్‌ని ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ చేయడం ఇదే తొలిసారి. ఎక్కువ మంది నామినేట్ చేయడంతో షాకైన షణ్ను ఈరోజు కోసమే ఇంతకాలం వెయిట్‌ చేశా.. ఇప్పుడు చూస్తార్రా నా గేమ్‌ అంటూ ఒక్కసారిగా రెచ్చిపోయాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news