Newsభార్య‌కు ఎఫైర్ అనుమానం... సంగారెడ్డిలో త‌ల న‌రికిన భ‌ర్త ఏం చేశాడంటే

భార్య‌కు ఎఫైర్ అనుమానం… సంగారెడ్డిలో త‌ల న‌రికిన భ‌ర్త ఏం చేశాడంటే

భార్య‌కు మ‌రో వ్య‌క్తితో శారీర‌క సంబంధం ఉంద‌న్న అనుమానంతో ఆమె త‌ల న‌రికి అత్యంత కిరాత‌కంగా హ‌త‌మార్చాడు ఓ వ్య‌క్తి. అంతే కాకుండా ఆమె త‌ల‌ను అలాగే ప‌ట్టుకు వెళ్లి ఐదు కిలోమీట‌ర్ల త‌ర్వాత ఆమె ఎవ‌రితో అయితే శారీర‌క సంబంధం పెట్టుకుంద‌ని అనుమానిస్తున్నాడో ఆ వ్య‌క్తి ఇంటి ముందు ప‌డేశాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిందీ సంఘటన.

 

నారాయణఖేడ్‌కు చెందిన సాయిలు (50)కు చాలా ఏళ్ల క్రిత‌మే పెళ్ల‌య్యింది. మూడు ద‌శాబ్దాల వైవాహిక జీవితంలో చిన్న చిన్న అర‌మ‌రిక‌లు ఉన్నా భార్య‌తో సంసారం సాఫీగా సాగింది. అయితే సాయిలుకు ఇటీవ‌ల త‌న భార్య మ‌రో వ్య‌క్తితో శారీరక సంబంధం పెట్టుకుంద‌న్న అనుమానం బ‌ల‌ప‌డింది. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. బుధ‌వారం అద‌ను చూసి భార్య త‌ల‌ను గొడ్డ‌లితో నరికేశాడు.

 

త‌ర్వాత 5 కిలోమీట‌ర్ల పాటు ద్విచక్ర వాహనంపై వెళ్లి తన భార్యతో శారీరక సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తి ఇంటి గుమ్మం ముందు పడేశాడు.
నేరస్తుడు సాయిలును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news