Newsయూపీలో దారుణం.. 37 ఏళ్ల అమెరికా అమ్మాయిపై ప‌లుమార్లు అత్యాచారం

యూపీలో దారుణం.. 37 ఏళ్ల అమెరికా అమ్మాయిపై ప‌లుమార్లు అత్యాచారం

భార‌త‌దేశంలో ఢిల్లీ, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు మ‌హిళ‌ల‌పై అత్యాచారాల విష‌యంలో టాప్ ప్లేసుల్లో దూసుకుపోతున్నారు. ఈ రెండు రాష్ట్రాలే కాదు నార్త్‌లో ప‌లు రాష్ట్రాల్లో ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. మ‌న‌దేశంలో ఉన్న మ‌హిళ‌ల‌కే కాదు విదేశాల నుంచి వ‌స్తోన్న మ‌హిళ‌ల‌కు కూడా భ‌ద్ర‌త లేద‌ని ప్ర‌పంచ దేశాలు వాపోతోన్న ప‌రిస్థితి ఇప్పుడు మ‌న దేశంలో క‌నిపిస్తోంది. తాజాగా అమెరికా నుంచి ఉత్త‌రాఖండ్‌కు వ‌చ్చిన ఓ ప‌ర్యాట‌కురాలిపై ప‌లుమార్లు ఓ వ్య‌క్తి అత్యాచారం చేసిన‌ట్టు బాధితురాలు హ‌రిద్వార్‌లో పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

 

అమెరికాకు చెందిన ఆ 37 ఏళ్ల అమ్మాయి యోగాపై ఆస‌క్తితో భారత్‌లోని ఉత్త‌రాఖండ్‌కు వ‌చ్చి అక్క‌డే నివాసం ఉంటోంది. ఆమెకు ఇంటి స‌మీపంలోనే ఉంటోన్న అభిన‌వ్ రామ్ అనే వ్య‌క్తి  ప‌రిచ‌యం అయ్యాడు. అయితే అత‌డు ఆమెతో చ‌నువు పెంచుకుని అక్టోబ‌ర్ 5న ఆమె ప్లాట్ బాల్క‌నీలో నుంచి దూకి ఆమెపై అత్యాచారం చేశాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

అయితే అంత‌కు ముందే వీరిద్ద‌రి మ‌ధ్య సెక్సువ‌ల్ కాంటాక్ట్ ఉంద‌ని.. గ‌తంలోనే వారు ప‌లుమార్లు సెక్సువ‌ల్‌గా క‌లుసుకున్నార‌ని.. పోలీసులు చెపుతుండ‌డం గ‌మ‌నార్హం. అయితే ఈ కేసును ఉపసంహరించుకోమని అభినవ్ రాయ్ తండ్రి మహిళపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆమె ఆరోపించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news