Gossipsపీకలు కొస్తుంది అంటు ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్న నాగబాబు..

పీకలు కొస్తుంది అంటు ఫ్యాన్స్ ని రెచ్చగొడుతున్న నాగబాబు..

గత కొంత కాలంగా సోషల్ మీడియాలో మెగాబ్రదర్ నాగబాబు పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆయన నా ఛానల్ నా ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తన సోదరుడికి మద్దతుగా ఓ వీడియోను విడుదల చేశారు. ప్రపంచయుద్ధం సమయంలో జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అనే నరరూప రాక్షసుడు ఉండేవాడనీ, అతని ప్రచారశాఖ మంత్రిగా గోబెల్స్ అనే మంత్రి ఉండేవాడని మెగాబ్రదర్ నాగబాబు తెలిపారు.

గోబెల్స్ ‘హిట్లర్ అంత గొప్ప, ఇంత గొప్ప’ అని చెప్పేవాడన్నారు. అప్పట్లో మీడియా లేక పోవడం వల్ల గ్లోబల్ చెప్పిందే వేదంగా భావించేవారు జనాలు. అలా తన ఆదిపత్యాన్ని పెంచుకుంటూ పోయాడు. ప్రస్తుతం ఏపిలో కూడా గ్లోబల్ నాయకులు ఉన్నారని..తమ నాయకుడు అంతా..ఇంతా అంటూ తెగ ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. జనసేనను తొక్కేయాలనీ, జనసైనికులను మానసికంగా కుంగదీయాలని అలాంటి గోబెల్స్ ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనకు, జనసైనికులకు ప్రస్తుతం సోషల్ మీడియా అండగా ఉందన్నారు.

కళ్యాన్ బాబు మీలాగా క్రిమినల్, ఫ్యాక్షనల్, స్కామ్స్, లిక్కర్, ఇసుక మాఫియాల ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి రాలేదు. స్వచ్ఛమైన పాలన అందించడానికి వస్తున్న పవన్ పై ఎన్ని గోబెల్స్ ప్రచారం చేసినా కుదరదు. చివరగా ఆయన గాజు గ్లాసుకి మీ..పరాయ అనే భేదాలు ఉండవని..దాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని..పగలగొట్టాలని చూస్తే ఒక్కో గాజు ముక్క మీ మెడలు కోస్తుందని బీకేర్ ఫుల్ అంటూ హెచ్చరించారు. మరి ఈ వీడియోపై అధికార, ప్రతి పక్ష పార్టీ వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

https://youtu.be/UXNn6AVBI5w

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news