Gossipsసెల్ఫీ కోసం టాప్ హీరోయిన్ బాత్ రూంలోకి వెళ్లిన ఫ్యాన్..!

సెల్ఫీ కోసం టాప్ హీరోయిన్ బాత్ రూంలోకి వెళ్లిన ఫ్యాన్..!

బాలీవుడ్ హీరోయిన్ కు జరిగిన ఓ క్రేజీ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతటా హాట్ న్యూస్ గా మారింది. ఇంతకీ ఏంటా న్యూస్ అంటే.. సెల్ఫీ పిచ్చిలో హీరోయిన్ వెంట పడిన ఓ ఫ్యాన్ ఏకంగా ఆమె బాత్ రూం లోకి వెళ్లి షాక్ ఇచ్చాడు. ఈరోజుల్లో సెల్ఫీ తెచ్చే అనర్ధాలు అందరికి తెలిసిందే. సెల్ఫీ మోజులో ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారు ఉన్నారు. అయితే బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తకు ఈ సెల్ఫీ షాక్ తగిలింది.

దుబయ్ లో జరిగే ఓ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వెళ్లిన ఈషా గుప్తా అక్కడ తన స్టేజ్ పర్ఫార్మెన్స్ తో అందరిని అలరించింది. అయితే ఈవెంట్ ముగిశాక కొందరు తనతో సెల్ఫీ దిగేందుకు ఇంట్రెస్ట్ చూపించగా అందుకు సరే అన్నది. అయితే ఓ అభిమాని ఆమె సెల్ఫీ మిస్ అవగా ఈషాతో ఎలాగైనా సెల్ఫీ దిగాలన్న ఆలోచనతో ఆమె వెంట పడ్డాడట. ఆమె అతన్ని గమనించకండానే బాత్ రూం లో దూరిందట. ఇంకేముందు అతను కూడా బాత్ రూం లో దూరి సెల్ఫీ అడిగాడట.

సెల్ఫీ కోసం బాత్ రూం దాకా వచ్చాడని అతనిపై కోప్పడ్డదట ఈషా గుప్త. ఇలాంటి పిచ్చి వేశాలు మానుకోమని చెప్పిందట. కేవలం సెల్ఫీ కోసం వచ్చాడు కాబట్టి పోలీసులకు కంప్లైంట్ లాంటివి ఇవ్వకుండా వదిలేసిందట. ఈమధ్య అసలే లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయి. తన హాట్ ఫోటో షూట్స్ తో ఈషా కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news