Gossipsరాజమౌళి , రామోజీ వివాదం ముదిరిందా..?

రాజమౌళి , రామోజీ వివాదం ముదిరిందా..?

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని చాటిచెప్పిన దర్శకుడు రాజమౌళి. ఈ సినిమా సెట్స్ కోసం రామోజి ఫిల్మ్ సిటీని బాగా వాడుకున్నారు. బాహుబలి కోసం రామోజి రావు స్పెషల్ సపోర్ట్ అందించారు. అంతేకాదు సినిమాకు కొంతమేర ఫైనాన్స్ ఇచ్చినట్టు టాక్. అయితే సినిమా కోసం అక్కడ భారీ సెట్లు వేశారు. దాదాపు బాహుబలి మొదటి, రెండు భాగాలు కలిపి ఐదేళ్లు ఆరెఫ్సిలోనే షూట్ చేశారు.

ఈ షూటింగ్ కు సంబందించిన రెంట్ ఖర్చులు కూడా తర్వాత సెటిల్ చేసేలా మాట్లాడుకున్నారట. రిలీజ్ తర్వాత కోట్లకు కోట్లు వసూళ్లు రాబట్టినా సరే రామోజికి ఇవ్వాల్సిన ఎమౌంట్ మాత్రం ఇవ్వలేదట. ఈ విషయం మీద రామోజికి, రాజమౌళికి మధ్య గొడవలు నడుస్తున్నాయని టాక్. అయితే ఇందులో ఆడియెన్స్ ఆలోచించేది ఏంటంటే డబ్బుల విషయంలో నిర్మాతలకు రామోజికి తేడా రావాలి కాని రాజమౌళితో ఎందుకు గొడవపడతాడని అంటున్నారు.

ఈ విషయంలోనే జక్కన్న కూడా రామోజి ప్రవర్తన నచ్చకనే తను తర్వాత చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకు అల్యూమినియం ఫ్యాక్టరీని వాడుతున్నాడని అంటున్నారు. మరి ఈ వ్యవహారంలో ఎంత నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. ఓ పక్క ఈ వార్త రాగానే బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news