Moviesబాలయ్యతో ఢీ.. సునీల్ నిర్ణయం సరైనదేనా..!

బాలయ్యతో ఢీ.. సునీల్ నిర్ణయం సరైనదేనా..!

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాధ్ డైరక్షన్ లో వస్తున్న సినిమా పైసా వసూల్. సెప్టెంబర్ 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు పోటీగా ఆరోజు ఏ సినిమా రిలీజ్ అవడం కష్టమే అనుకున్నారు కాని బాలయ్యకు పోటీగా నేనొస్తున్నా అంటున్నాడు సునీల్. హీరోగా నిలదొక్కుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న సునీల్ ప్రస్తుతం క్రాంతి మాధవ్ డైరక్షన్ లో చేసిన సినిమా ఉంగరాల రాంబాబు.

సినిమా పూర్తయినా సరే రిలీజ్ డేట్ మాత్రం లాక్ చేయలేదు. వరుసగా క్రేజీ సినిమాలు వచ్చి పడటం వల్ల సునీల్ కు ఛాన్స్ రాకుండా పోయింది. అందుకే ఈసారి డేర్ గా బాలయ్యతో పోటీకి సిద్ధమయ్యాడు సునీల్. ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో దర్శకుడిగా తన అభిరుచిని చాటుకున్న క్రాంతి మాధవ్ సునీల్ తో చేస్తున్న ఉంగరాల రాంబాబు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

బాలయ్యను పూరి మార్క్ పక్కా మాస్ హీరోగా చూపించిన పైసా వసూల్ ప్రభంజనాలు భారీగానే ఉన్నాయి. శ్రీయ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 17న ఖమ్మంలో పైసా వసూల్ ఆడియో రిలీజ్ అవబోతుంది. బాలయ్యతో సునీల్ పోటీ ఎలా ఉండబోతుందో సెప్టెంబర్ 1 నాడు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news