Newsబాబు సాధించారు..

బాబు సాధించారు..

తనపై విచారణలు జరక్కుండా స్టేలు తెచ్చుకోవడంలో సమర్థుడైన చంద్రబాబు.. మరోసారి ఆదిశగా విజయం సాధించారు. తనపై ఓటుకునోటు కేసులో విచారణ చేయకుండా హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఎంతైనా ఈ విషయంలో ఆయనకు మించిన అనుభవజ్ఞులు లేరు కదా.
గురువారం హైకోర్టులో దీనిపై విచారణ జరిగింది. చంద్రబాబు తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్ధార్థ లోథా వాదనలు విన్పించారు. ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసిన వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డికి కేసుకు సంబంధం లేదని.. కేవలం బాబుపైనే రాజకీయ కక్ష్యతోనే ఇలా చేశారని ఆయన వాదించారు. దీంతో ఏకీభవించిన హైకోర్టు ఏసీబీ కోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది. దీంతో తెలుగు తమ్ముళ్లు ఆనందంగా ఉన్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news