Gossipsనందమూరి వారసుడు పవన్ కళ్యాణ్ అట.. సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని..

నందమూరి వారసుడు పవన్ కళ్యాణ్ అట.. సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని..

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన తరపున రాజకీయ ప్రక్షాళణకు అన్ని అంశాల గురించి చర్చలు నడుపుతున్నాడు. ఈమధ్యనే ఓ మీటింగ్ లో ఏపి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా వాళ్లు కూడా పవన్ కళ్యాణ్ ఫోబియోలో ఉన్నారని తెలుస్తుంది. ఎందుకు అంటే నిన్న జరిగిన కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మైక్ అందుకుని మాట్లాడిన పోసాని రెండు సార్లు కళ్యాణ్ రాం బదులు పవన్ కళ్యాణ్ అన్నాడు.

పోసాని కన్ ఫ్యూజన్ కు కళ్యాణ్ రాం కూడా షాక్ అయ్యాడని తెలుస్తుంది. ఇక ఎం.ఎల్.ఏ ఈవెంట్ లో ఎం.ఎల్.ఏ అంటే మంచి లక్షణాలున్న అబ్బాయే అయినా సినిమా కాకుండా రాజకీయాల్లో కళ్యాణ్ రాం ఎం.ఎల్.ఏ అవ్వాలని అన్నారు పోసాని కృష్ణమురళి. ఉపేంద్ర మాధవ్ డైరక్షన్ లో వస్తున్న ఎం.ఎల్.ఏ మూవీ ఈ శుక్రవారం రిలీజ్ కాబోతుంది.

కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. టీజర్, ట్రైలర్ సినిమా అంచనాలు పెంచేయగా ఈ సినిమాతో కళ్యాణ్ రాం హిట్ కొట్టడం గ్యారెంటీ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news