Gossipsఎన్టీఆర్ చెప్పిన ఆ ఇద్దరు సన్నిహితులు వీరే…

ఎన్టీఆర్ చెప్పిన ఆ ఇద్దరు సన్నిహితులు వీరే…

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో  జై లవకుశ సినిమా ఎన్టీఆర్ చేస్తున్నప్పుడు నుండి సినిమా మీద అటు ప్రేక్షకుల్లో ఇటు సినీఇండస్ట్రీలో ఒక పక్క ఆందోళన మరో పక్క క్యూరియాసిటీ పెంచాడు ఎన్టీఆర్ .దీనికి కారణం డైరెక్టర్ బాబీ ,ఎందుకంటే బాబీ గత చిత్రాలన్నీ చూస్తే పరాజాలని కొనసాగిస్తున్న డైరెక్టర్ గా ఉంటె ,వరస హిట్లతో మంచి ఊపుమీద ఉన్న ఎన్టీఆర్ డైరెక్టర్ బాబీ ని ఎంచుకోవటం ఒక్కింత ఆశ్చర్యం కలిగించింది అనే చెప్పాలి .

జై లవకుశ స్టోరీ విని ఉద్వేగానికి లోనయ్యానని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నారు. తాను త్రిపాత్రాభినయం చేస్తున్న ‘జై లవకుశ’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తారక్ మాట్లాడుతూ.. ‘‘బాబీ దగ్గర ఒక కథ ఉంది వినొచ్చు కదా అని అన్నే చెప్పారు. నేను విన్నాను బాగుంది అన్నారు కానీ ఆ కథేంటో ఆయన అసలు చెప్పలేదు. ఎప్పుడైతే డైరెక్టర్ బాబీ వచ్చి నాకు కథ చెప్పాడో.. నేను లేచి బాబీ చేయి పట్టుకుని కౌగిలింత కూడా ఇవ్వలేదు. భయపడిపోయాను. ఈ చిత్రం చేయగలుగుతానా? అని. కానీ నేను, అన్న ఏదైతే అనుకున్నామో దానికి సరిపోయే కథ. తర్వాత మనం కలుద్దాం బాబీ అని చెప్పి వదిలేశాను.

అప్పటి నుంచి ఈ కథ గురించే ఆలోచించాను. ఈ కథను నాకు అత్యంత ఆప్తులైన ఇద్దరితో నేను షేర్ చేసుకున్నాను. వారి పేర్లు ఇప్పుడు చెప్పాను. ఈ సినిమా సూపర్ హిట్ అయితే వాళ్లిద్దరి పేర్లు చెబుతాను. అప్పటి వరకు వాళ్ల పేర్లు చెప్పలేను. వాళ్లిద్దరికి ఈ కథ చెప్పగానే ‘బ్రహ్మాండంగా ఉంది కదా.. చేస్తే బాగుంటుంది కదా’ అని ప్రోత్సహించారు. వాళ్లెవరో అన్నకు కూడా తెలుసు. మీ అందరికీ గర్వకారణంగా ఉన్న రోజే వాళ్ల పేర్లు చెబుతాను.’’ అని అభిమానుల్లో ఆసక్తిని రేపాడు ఎన్టీఆర్.

ఇంతకీ ఎన్టీఆర్ అత్యంత ఆప్తులు ఎవరని ఇటు ప్యాన్స్ లో అటు సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతుంది , ఆ ఇద్దరు ఎవరనేది  చూస్తే  ఒకరు ప్రముఖ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ,రెండవది కింగ్ అక్కినేని నాగార్జున అనే పేర్లు సోషల్ మీడియా వేదికగా ఒకటే రచ్చ జరుగుతుంది ,చూదాం సినిమా రిలీజ్ అయ్యిన తరువాత ఎన్టీఆర్ ఎవరు పేర్లు చెపుతాడో చూదాం .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news