Moviesగ్యాప్ లేకుండా ఉతికి ఆరేస్తున్న ఎన్టీఆర్

గ్యాప్ లేకుండా ఉతికి ఆరేస్తున్న ఎన్టీఆర్

యాక్షన్ సన్నివేశాలంటే తారక్‌కి వెన్నతో పెట్టిన విద్య. ఎంత భారీ ఎపిసోడ్‌లైనా సరే.. అలుపుసొలుపు లేకుండా ఇరగదీసేస్తాడు. రిస్కీ సీన్లలో సైతం డూప్స్ లేకుండా సత్తా చాటుతాడు. లెంగ్త్ ఎక్కువైనా ఫర్వాలేదు.. కుమ్ముడు ఆపడం మానడు. ఆ స్థాయి ఎనర్జీ వుంది కాబట్టే అతనికి మాస్‌ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకే.. తారక్ ప్రతి సినిమాలోనూ హై-వోల్టేజ్ యాక్షన్ సీన్స్ వుండేలా ప్లాన్ చేస్తాడు. దర్శకనిర్మాతలు సైతం ఫ్యాన్స్‌ని సంతోషపెట్టేలా ఎన్టీఆర్‌తో అదిరిపోయే యాక్షన్స్ చేయిస్తాడు. ఇప్పుడు తారక్ చేస్తున్న ‘జై లవ కుశ’ సినిమాలోనూ ఆ తరహా యాక్షన్ ఎపిసోడ్స్ డైరెక్టర్ బాబీ పెట్టినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని బూత్ బంగ్లాలో జరుగుతోంది. అక్కడ ఒక యాక్షన్ ఎపిసోడ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్ కూడా వేశారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలోకెల్లా హైలైట్ అయ్యే రేంజులో బాబీ తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. గత సినిమాలతో పోల్చుకుంటే, ఈ ఎపిసోడ్‌లో తారక్ విలన్లను బలంగా ఉతికి ఆరేస్తాడని, మాస్ ఆడియెన్స్‌కి ఈ సీన్లు ఉర్రూతలూగించేలా వుంటాయని యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే.. ఈ ఫైట్ సీన్ మాస్ ఆడియెన్స్‌కి ప్రత్యేక ట్రీట్‌లా వుండబోతోందన్నమాట. ఇందులో తారక్ సరసన రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. నందిత, హంసా నందినిలు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news