Gossipsమెహబూబా గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తున్న మహనటి..!

మెహబూబా గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేస్తున్న మహనటి..!

సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి సినిమా నిన్న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కీర్తి సురేష్ లీడ్ రోల్ చేసిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ కూడా సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ఇక ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధిస్తుందని బహుశా ఊహించి ఉండరు.

ఇక ఈ సినిమాకు పోటీగా ఒక్కరోజు తేడాతో వస్తుంది మెహబూబా. వరుస ఫ్లాపుల తర్వాత పూరి మనసు పెట్టి తీసిన సినిమా ఇది. ఎలాగు భరత్ అనే నేను సందడి తగ్గింది. నా పేరు సూర్య అంత హంగామా లేదు. వచ్చేది మహానటి ఎలా ఉన్నా తమ సినిమాకు అడ్డు రాదు అనుకున్నారు. కాని మెహబూబా మేకర్స్ గుండెల్లో రైళ్లు పరుగెట్టేళా చేస్తుంది మహానటి మూవీ.

సినిమా ఓ అద్భుత కళాఖండంగా తీర్చిద్దిద్దారు దర్శకుడు నాగ్ అశ్విన్. తెలిసిన కథనే మనసుని కదిలించేలా చేశారు. సావిత్రమ్మ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆమెకిచ్చే ఘనమైన నివాళి ఈ మహానటి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news