Moviesభరత్ అనే నేను రన్ టైం లాక్.. ఆ 15 నిమిషాలు...

భరత్ అనే నేను రన్ టైం లాక్.. ఆ 15 నిమిషాలు సీట్లలో ఎవరు కూర్చోరట..!

సూపర్ స్టార్ మహేష్, కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమంతుడు తర్వాత వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఏప్రిల్ 20న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రన్ టైం లాక్ అయినట్టు తెలుస్తుంది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా 2 గంటల 40 నిమిషాల రన్ టైం తో వస్తుందని అంటున్నారు. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రమోషన్ మొదలు పెట్టిన చిత్రయూనిట్ సినిమా రేంజ్ మరింత పెంచేలా చేస్తున్నారు.

ఇక యూఎస్ లో అత్యధిక ప్రీమియర్స్ ఏర్పాటు చేస్తున్నారట. సినిమా సెన్సార్ కు సిద్ధమవుతుండగా ఓ 15 నిమిషాల సీన్ అయితే మాత్రం అభిమానులెవరు సూట్లలో కూర్చోరట. ఈ సీన్ అసెంబ్లీలో ఉంటుందట.. అంతేకాదు ఈ సీన్ లో ప్రత్యేకంగా డైలాగ్స్ బాగుంటాయని. కచ్చితంగా సినిమాలో ఈ ఒక్క సీన్ ఎక్కడికో తీసుకెళ్తుందని తెలుస్తుంది.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అవగా.. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కనిపిస్తున్నాడు. మరి ఈ యంగ్ అండ్ డైనమిక్ సిఎం ఎలా ఉంటాడు అన్నది తెలుసుకోవాలంటే మాత్రం మరో 11 రోజులు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news