Gossipsఎన్టీఆర్, బాలయ్యల మధ్య మరో కొత్త వివాదం..!

ఎన్టీఆర్, బాలయ్యల మధ్య మరో కొత్త వివాదం..!

నందమూరి స్టార్ హీరోలు బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య దూరం అందరికి తెలిసిందే. ఈ విషయంలో నందమూరి ఫ్యాన్స్ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. నందమూరి ఫ్యాన్స్ లోనే కొందరు బాలయ్యకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ వస్తుండగా మరికొందరు ఎన్.టి.ఆర్ చెంత చేరిపోయారు. అయితే ఒకరి ఫ్యాన్స్ ఒకరికి ప్రోత్సాహం అందించుకోవడం కామనే. అయితే బాబాయ్, అబ్బాయ్ గొడవ ఇప్పుడప్పుడే ముగుస్తుంది అనిపించకపోగా ఇంకా దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

దీని కారణం ఎన్.టి.ఆర్ తండ్రి హరికృష్ణ అని తెలుస్తుంది. టిడిపిలో తనకు ఏ కేడర్ ఇవ్వని చంద్రబాబు మీద పగ పెంచుకున్నాడు హరికృష్ణ. అందుకే ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ వచ్చిన నాటి నుండి నందమూరి ఫ్యాన్స్ లో యుద్ధం మొదలైంది. ముఖ్యంగా బాలయ్యను సపొర్ట్ చేస్తున్న నందమూరి ఫ్యాన్స్ ఎన్.టి.ఆర్ పై విమర్శలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుందని తెలుస్తుంది. ఈ క్రమంలో బాలయ్య, ఎన్.టి.ఆర్ ల మధ్య మరింత దూరం పెరుగుతుందని అంటున్నారు. నిజంగా హరికృష్ణ వై.సి.పి లో చేరితే అదో సంచలనం అవుతుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news