Moviesప‌వ‌న్ నీకు హిట్ ఇచ్చిన మంచి మ‌నిషినే నిండా ముంచేశావ్ క‌దా...

ప‌వ‌న్ నీకు హిట్ ఇచ్చిన మంచి మ‌నిషినే నిండా ముంచేశావ్ క‌దా బ్రో..!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ సీనియ‌ర్ నిర్మాత‌ను నిండా ముంచేశాడు. ఇప్పుడు ఇదే విష‌యం టాలీవుడ్ వ‌ర్గాల్లో బాగా వైర‌ల్ అవుతోంది. ఒక‌ప్పుడు పూర్తిగా జీరో అయిపోయిన ఆ సినియ‌ర్ నిర్మాత త‌మిళ హీరో అజిత్ ద‌య‌తో ఒక్క‌సారిగా పుంజుకున్నాడు. గ‌తంలో ప‌వ‌న్‌తో సినిమా చేసిన పాపానికి మ‌ళ్లీ ప‌వ‌న్ డేట్లు సంపాదించాడు. అంతే ఉన్నదంతా అక్క‌డే పెట్టేసి మ‌ళ్లీ పాతాళంలోకి వెళ్లిపోయేలా ఉన్నాడు. ఆ నిర్మాత ఎవ‌రో కాదు శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం. ర‌త్నం.

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఇదే టైంలో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. నాలుగేళ్ల నుంచి కూడా షూటింగ్ జ‌రుగుతున్నా ఇప్ప‌ట‌కీ షూటింగ్ పూర్తి కాలేదు. చాలా పెండింగ్‌లో ఉంది. ప‌వ‌న్ మ‌రో నాలుగు నెల‌ల వ‌ర‌కు రాజ‌కీయాల్లోనే ఉంటాడు. ఆ త‌ర్వాత తిరిగి డేట్లు ఇచ్చినా ముందు ఓజీ సినిమాకే ఇస్తాడంటున్నారు.

ప‌వ‌న్ వ‌కీల్‌సాబ్, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్‌లు ఒకే టైంలో స్టార్ట్ అయ్యాయి. వ‌కీల్‌సాబ్‌, భీమ్లానాయ‌క్‌, బ్రో సినిమాలు వ‌చ్చి రిలీజ్ అయ్యాయి. ఇంకా వీర‌మ‌ల్లు సినిమా అలాగే ఉంది. మ‌రో యేడాదికి అయినా ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా ? అంటే సందేహంగానే ఉంది. ఇప్ప‌టికే సినిమా కోసం వేసిన సెట్ల కోసం అద్దె క‌ట్ట‌లేక నిర్మాత తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు. వ‌డ్డీలు పెరిగిపోతున్నాయి. బ‌య‌ట ఫైనాన్షియ‌ర్ల గోల మామూలుగా లేద‌ట‌.

నిర్మాత ర‌త్నం కాస్తో కూస్తో ఇటీవ‌ల కాలంలో వెన‌కేసుకున్న‌ది అంతా ఈ సినిమా దెబ్బ‌తో కోల్పోవాల్సి వ‌స్తుంద‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. ఓజీ త‌ర్వాత ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ఆ త‌ర్వాత మ‌రో సినిమా అంతేకాని వీర‌మ‌ల్లు ఊసే ప‌వ‌న్ ద‌గ్గ‌ర నుంచి రావ‌డం లేదంటున్నారు. పైగా సినిమా ఫ‌లితంపై కూడా ప‌వ‌న్‌కు న‌మ్మ‌కం లేద‌ని మ‌రో చ‌ర్చ న‌డుస్తోంది. ఏదేమైనా గ‌తంలో ప‌వ‌న్‌కు ఖుషి లాంటి క్లాసిక్ హిట్ సినిమా ఇచ్చిన మంచి నిర్మాత‌కు ప‌వ‌న్ ఈ గ‌తి ప‌ట్టిస్తాడ‌ని ఊహించ‌లేద‌న్న గుసగుస‌లు ఇండ‌స్ట్రీలో న‌డుస్తున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news