Moviesఅప్పుడే రికార్డులు బ్రేక్ చేస్తున్న గుంటూరు కారం.. RRR తరువాత ఆ...

అప్పుడే రికార్డులు బ్రేక్ చేస్తున్న గుంటూరు కారం.. RRR తరువాత ఆ స్ధానం మనోడిదే..!!

గుంటూరు కారం ..గుంటూరు కారం.. గుంటూరు కారం.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు మారుమ్రోగిపోతుంది . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా నటించిన సినిమా గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాకి సంబంధించిన పూర్తి పనులను కంప్లీట్ చేసేసాడు త్రివిక్రమ్ .

అంతేకాదు హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమాకి సంబంధించిన న్యూస్లను తెగ ట్రెండ్ చేస్తున్నారు మహేష్ అభిమానులు . గుంటూరు కారం నైజాం హక్కులను దిల్ రాజు ఏకంగా 45 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. హైదరాబాద్లో రికార్డ్ స్థాయిలో సింగిల్ స్క్రీన్ లలో గుంటూరు కారం సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

హైదరాబాదులో 96 సింగిల్ స్క్రీన్లు ఉండగా 90 స్క్రీన్ లో గుంటూరు కారం మూవీ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఓ న్యూస్ వినిపిస్తుంది. హైలైట్ ఏంటంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఆ రేంజ్ లో సింగిల్ స్క్రీన్లు దక్కించుకున్న మూవీ గా గుంటూరు కారం రికార్డు నెలకొల్పింది . దీంతో ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news