News"అది డబ్బులిస్తే ఏమైన చేసే బ్యాచ్.. ఆ గుంపు అంతే"..బాలీవుడ్ పై...

“అది డబ్బులిస్తే ఏమైన చేసే బ్యాచ్.. ఆ గుంపు అంతే”..బాలీవుడ్ పై సందీప్ రెడ్డి వంగా సెన్సేషనల్ కామెంట్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు కూల్ గా ఉండే సందీప్ రెడ్డివంగ ఫస్ట్ టైం బరస్ట్ అయిపోయి సెన్సేషనల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన సందీప్ రెడ్డివంగా ఆ తర్వాత యానిమల్ సినిమాతో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నారు . కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చిన ఎక్కువ పాజిటివ్ కామెంట్స్ తో యానిమల్ సినిమా దుమ్ము దులిపేసింది.

రన్బీర్ కపూర్ కి కొత్త నటుడిగా లైఫ్ ముందుకు తీసుకెళ్లొచ్చు అంటూ అవకాశం ఇచ్చింది . ఈ సినిమాలో రష్మిక మందన్నా బోల్డ్ పెర్ఫార్మెన్స్ కి దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో ఉంది . రీసెంట్గా సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బాలీవుడ్ లో జరుగుతున్న అరాచకాలపై ఓపెన్గా స్పందించాడు . ఆయన మాట్లాడుతూ ..”దాదాపు 5ఏళ్లు నేను ముంబైలోనే గడిపాను .. ఒకటే ఒకటి నాకు బాగా అర్థమైంది ..ఇక్కడ ఒక గ్యాంగ్ (క్రిటిక్స్) ఉందనే విషయం నాకు బాగా బాగా తెలిసింది .

వారికి పర్టికులర్గా కొన్ని రకాల సినిమాలు మాత్రమే నచ్చుతాయి .. అవి మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు .. కొందరు ఫిలిం మేకర్స్ ని మాత్రమే పైకి తీసుకెళ్తారు .. టాలెంట్ ఉన్న ఎంతమంది డైరెక్టర్లు తొక్కేయడానికి చూస్తారు.. ఈ క్రిటిక్స్ మనీ ఇచ్చి పాజిటివ్ రివ్యూ చెప్పించుకునే టైప్ అని .. ఎలాంటి దాపరికం లేకుండా ఉన్న నిజాలను పచ్చిగా బయటపెట్టాడు సందీప్ రెడ్డివంగా . దీంతో సందీప్ రెడ్డి ఫుల్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు . నిజమే నువ్వు చెప్పింది 100% ట్రూ అంటూ ఆయనకు వత్తాసు పలుకుతున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news