Newsముగ్గురు కుర్ర‌హీరోయిన్ల కెరీర్ మ‌టాష్ చేసిన ప‌వ‌న్‌...!

ముగ్గురు కుర్ర‌హీరోయిన్ల కెరీర్ మ‌టాష్ చేసిన ప‌వ‌న్‌…!

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తూ చేసిన బాలీవుడ్ హిట్ రీమేక్ వకీల్ సాబ్. హిందీలో అమితాబ్ బచ్చన్, తాప్సీ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలోనూ అజిత్ కథానాయకుడిగా రీమేక్ అయింది. అక్కడ బోనికపూర్ నిర్మించారు. శ్రద్దా శ్రీనాథ్ తమిళ్మలో నటించింది. ఇలా రెండు భాషలలో చూసేసిన సినిమాను పవన్ తో రీమేక్ చేయాలనుకోవడం దిల్ రాజుకి పెద్ద రిస్కే.

కానీ, ఎన్నో ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇవ్వడంతో ఆయన రీ ఎంట్రీ ఇస్తూ దిల్ రాజు కి డేట్స్ ఇవ్వడంతో కొత్త కథను ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా తయారు చేయడానికి టైం పడుతుందని పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా అన్నీ హంగు ఆర్భాటాలు ఉన్నాయి. బద్రి తర్వాత పవన్ కళ్యాణ్, ప్రకాశ్ రాజ్ కలిసి నటించిన సీన్స్ కూడా ఆదరణ పొందాయి.

అయితే, ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్‌, ఇందులో కీలక పాత్రల్లో కనిపించిన నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ మాత్రం మళ్ళీ మంచి సినిమాలేక ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నివేదా థామస్ కెరీర్ ఊపందుకుంటుందనుకుంటే దీనికి ముందే కమిటైన శాకిని డాకిని తప్ప మరో సినిమాలో కనిపించలేదు. ఇక అంజలి పెద్ద హీరోల సరసన హీరోయిన్‌గా అంటే అవుట్ డేటెడ్ అని ఫీలవుతున్నారు.

ఇక అనన్య నాగళ్ళ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. ఇలాంటి అమ్మాయిని మిగతా పనులకోసం ఉపయోగించుకుంటారు తప్ప హీరోయిన్‌గా అవకాశాలు ఇచ్చే దర్శకనిర్మాతలు ఉండరు. సోషల్ మీడియాలో అనన్య అందాల ఆరబోతతో మోత మోగిస్తుంది. ఎద అందాలతో నాభి సోయగంతో నరికేస్తుంది. అయినా అనన్య అక్కడికే పరిమితం అవుతుంది తప్ప హీరోయిన్ ఛాన్స్ మాత్రం దక్కడం లేదు. వకీల్ సాబ్ ఈ ముగ్గురికి ఏమాత్రం ఉపయోగపడలేదనే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news