Movies"తల్లి చనిపోయినా కూడా.. షూటింగ్ పూర్తిచేసి మరీ వెళ్లిన చంద్ర మోహన్"..ఆ...

“తల్లి చనిపోయినా కూడా.. షూటింగ్ పూర్తిచేసి మరీ వెళ్లిన చంద్ర మోహన్”..ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!

టాలీవుడ్ సీనియర్ నటుడు చంద్రమోహన్ నేడు ఉదయం మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు తమిళంలో హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన చంద్రమోహన్ వయోభారంతో గత కొంతకాలంగా బాధపడుతూ హైదరాబాదులోని అపోలో హాస్పిటల్స్ లో చికిత్స తీసుకుంటూ వచ్చాడు. ఇటీవల గుండెకు సంబంధించి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటూ వచ్చాడు .

కాగ నవంబర్ 11న ఉదయం 9 గంటల 45 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు . దీంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది . పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 975 సినిమాలో నటించిన ఆయన 175కు పైగా సినిమాలలో హీరోగా రాణించారు. అంతేకాదు చంద్రమోహన్ చాలా స్ట్రిక్ట్ ..షూటింగ్ కి టైం కి వచ్చేస్తారు. అంతే కాదు షూటింగ్ టైంలో చాలా డిసిప్లీన్ గా ఉంటారు .

అల్లరి చిల్లర వేషాలు వేయకూడదు అంటూ.. షూటింగ్ అంటే మనకు పవిత్ర మైన గుడి లాంటిది అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . అంతేకాదు ఆయన ఎంత డెడికేషన్ పర్సన్ అంటే తన తల్లి చనిపోయింది అని తెలిసిన కూడా సినిమా షూట్ ని ఆపకుండా కంటిన్యూ చేయించి షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత తన తల్లి పార్థివ దేహాన్ని చూడడానికి వెళ్లారు. ఆ సినిమా మరేదో కాదు ఆయన కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన మనసంతా నువ్వే .

ఈ సినిమాలో చంద్రమోహన్ పాత్ర ఎంత ప్రత్యేకమో.. ఎన్నిసార్లు చెప్పుకున్న తక్కువే . ఆ సినిమా చేస్తున్న టైంలో ఆయన తల్లి మరణించింది . ఆ రోజు షూటింగ్లో ఉండగా ఆ వార్త వినడంతో బాధపడిపోయిన ఆయన షూటింగ్ వదిలి మాత్రం వెళ్లలేదు . షూటింగ్ మధ్యలో ఆపేసి వెళ్లడం అందరికీ అసౌకర్యంగా ఉంటుంది అని షూటింగ్ కంప్లీట్ చేశాకే తన తల్లి పార్థదేహాన్ని చూడడానికి వెళ్లారట . అంత నిబద్ధతగా ఉండేవారు అని అప్పట్లో సినీ ప్రముఖులు చెప్పుకొచ్చారు . అలాంటి ఆయన మన మధ్య లేకపోవడం నిజంగా సినిమా ఇండస్ట్రీ చేసుకున్న పాపం అని చెప్పాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news