Newsఆ విషయంలో ప్రభాస్, ఎన్టీఆర్ సేమ్ టు సేమ్... నమ్మితే ప్రాణం...

ఆ విషయంలో ప్రభాస్, ఎన్టీఆర్ సేమ్ టు సేమ్… నమ్మితే ప్రాణం ఇస్తారా…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరు హీరోలలో ఉన్న కామన్ క్వాలిటీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ఒక విషయంలో ప్రభాస్, ఎన్టీఆర్ సేమ్ టు సేమ్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. స్నేహానికి ఈ ఇద్దరు హీరోలు ఇచ్చే విలువ అంతాఇంతా కాదని చెప్పవచ్చు.

ప్రభాస్ యాక్టింగ్ లో శిక్షణ తీసుకునే సమయంలో ప్రభాస్ శ్రీను పరిచయం కాగా అప్పటినుంచి ఇప్పటివరకు వీళ్లిద్దరి స్నేహం కొనసాగుతోంది. ప్రభాస్ గత కొన్నేళ్లలో ఎన్నో మెట్లు పైకి ఎదిగినా ప్రభాస్ శ్రీనుపై చూపించే స్నేహంలో, ఇచ్చే గౌరవంలో ఏ మాత్రం తేడా లేదు. తన సినిమాలో ప్రభాస్ శ్రీనుకు సూట్ అయ్యే రోల్ ఉంటే మాత్రం ఆ రోల్ ను కచ్చితంగా ప్రభాస్ శ్రీనుకు వచ్చేలా చేయడానికి ప్రభాస్ తన వంతు కష్టపడతారు.

ప్రభాస్ తన చిన్నప్పటి స్నేహితులతో సైతం ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉన్నారని తెలుస్తోంది. ప్రభాస్ లా ఇండస్ట్రీలో అదే స్థాయిలో స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చే హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జూనియర్ ఎన్టీఆర్ రాజీవ్ కనకాల మధ్య స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఆంధ్రావాలా, మరికొన్ని సినిమాలలో తారక్ రాజీవ్ కనకాలకు ఛాన్స్ ఇప్పించి స్నేహితులంటే తనకు ఎంత ఇష్టమో స్నేహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో చెప్పకనే చెప్పేశారు.

స్కూల్ ఫ్రెండ్ అయిన స్నేహల్ తో తారక్ ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉంటారు. స్నేహానికి తారక్ ఇచ్చే ప్రాధాన్యత అంతాఇంతా కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్, ఎన్టీఆర్ స్నేహం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధం అనేలా ఫ్రెండ్ షిప్ విషయంలో వ్యవహరిస్తారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రభాస్, ఎన్టీఆర్ కాంబోలో ఒక భారీ మల్టీస్టారర్ తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news