Movies"ఒళ్లు బలిసిందా..?" ..తెలుగు హీరోలపై కాజల్ సెన్సేషనల్ కామెంట్స్ .. అంత...

“ఒళ్లు బలిసిందా..?” ..తెలుగు హీరోలపై కాజల్ సెన్సేషనల్ కామెంట్స్ .. అంత మాట అనేసిందేంటి..?

కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ చందమామగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది . అఫ్కోర్స్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా క్రియేట్ చేస్తుంది. అయితే కాజల్ అగర్వాల్ కెరియర్ పిక్స్ లో ఉండగానే ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చేసింది . ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం చాలా చాలా ట్రై చేసింది. అనుకున్న విధంగానే కొడుకు పుట్టిన తర్వాత కాజల్ అగర్వాల్ తన బాడీ ఫిజిక్ ను మార్చేసుకొని ..చాలా చాలా కష్టపడి మళ్లీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి అవకాశాలు దక్కించుకుంది .

పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది . తాజాగా ఆమె నటించిన సినిమా సత్యభామ .ఈ సినిమా మే 30వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది కాజల్ అగర్వాల్ . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీని పొగిడేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడింది. దీంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగిపోతుంది .

ఆమె మాట్లాడుతూ..” బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కి పెళ్లి అయిన తర్వాత కూడా ఆమెను హీరోయిన్ గానే చూస్తారు. బిడ్డ పుట్టాక కూడా ఆమెకు హీరోయిన్ గానీ అవకాశాలు ఇస్తారు. కానీ టాలీవుడ్ లో అలా జరగదు .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత ట్రై చేసినా ..పెళ్లి పిల్లల తర్వాత ఆ హీరోయిన్ హీరోయిన్గా ఎదగలేదు ..మేకర్స్ హీరోలు ఎందుకో అలాంటి అవకాశాలు ఇవ్వరు .. ఆ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది “అంటూ తనదైన స్టైల్ లో కామెంట్స్ చేసింది కాజల్ అగర్వాల్ .

దీంతో ఒక్కసారిగా ఆమెపై నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది ..అంటే నీకు అవకాశాలు ఇవ్వనంత మాత్రాన తెలుగు హీరోలు చెడ్డ వాళ్ల ..? అలా ఎలా మాట్లాడగలవు ..?కాజల్ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు. తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ కాజల్ ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కునేసింది. కొందరు ఒళ్లు బలిసిందా..? అంటూ ఘాటుగా రెస్పాండ్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news