Newsఆ స్టార్ హీరోతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌... డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..!

ఆ స్టార్ హీరోతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌… డైరెక్ట‌ర్ ఎవ‌రంటే..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న కెరీర్‌లో కొన్ని మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశారు. విక్ట‌రీ వెంక‌టేష్‌తో గోపాలా గోపాలా – సాయిధ‌ర‌మ్ తేజ్‌తో బ్రో సినిమాల‌లో న‌టించారు. క‌థ డిమాండ్ చేస్తే తాను స్టార్ హీరో అన్న ఫీలింగ్ లేకుండా ప‌వ‌న్ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేసేందుకు ఎప్పుడూ ముందు ఉంటారు. రీసెంట్‌గా ప‌వ‌న్ బ్రో మ‌ల్టీస్టార‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు.

అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో మ‌రో ఇంట్ర‌స్టింగ్ మ‌ల్టీస్టార‌ర్ చేస్తాన‌ని ఓ త‌మిళ ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించ‌డం విశేషం. ఆ ద‌ర్శ‌కుడు కూడా ప‌వ‌న్‌కు స‌న్నిహితుడే. గ‌తంలో ప‌వ‌న్‌తో రెండు సినిమాలు తెర‌కెక్కించిన ఎస్‌.జె సూర్య‌నే. సూర్య – ప‌వ‌న్ కాంబోలో వ‌చ్చిన ఖుషి బ్లాక్‌బ‌స్ట‌ర్‌. ఆ త‌ర్వాత వ‌చ్చిన కొమ‌రం పులి మాత్రం డిజాస్ట‌ర్‌. ఇక త‌న ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాలు వ‌రుస‌గా డిజాస్ట‌ర్లు అవుతుండ‌డంతో సూర్య న‌టుడిగా మారి విల‌న్ పాత్ర‌లు పోషిస్తున్నాడు.

సూర్య త‌మిళంలో ఎంద‌రో స్టార్ హీరోల‌తో సూప‌ర్ హిట్ సినిమాలు తెర‌కెక్కించారు. అయితే అజిత్‌తో మాత్రం సూర్య సినిమాలు చేయ‌లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు తాను అజిత్‌తో సినిమా తీయాల్సి వ‌స్తే… అజిత్ – ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్లో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయాల‌నుకుంటున్న‌ట్టు తెలిపాడు. ఒకవేళ సూర్య మ‌ళ్లీ మెగాఫోన్ ప‌ట్టి అజిత్ – ప‌వ‌న్ కాంబోలో మాసివ్ మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తే రికార్డులు నెక్ట్స్ లెవ‌ల్లో ఉంటాయ‌ని అటు అజిత్‌, ఇటు ప‌వ‌న్ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

ఈ ఇద్ద‌రు హీరోల కాంబినేష‌న్లో నిజంగానే మ‌ల్టీస్టార‌ర్ సినిమా వ‌స్తే అది ఖ‌చ్చితంగా ఇండియ‌న్ సినిమా స్క్రీన్ పై సెన్షేష‌న‌ల్ మూవీగా రికార్డుల్లో నిలిచిపోతుంద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news