Moviesశ్రీదేవి మీద పిచ్చి ప్రేమ‌తో ఆ దుబాయ్ షేక్ ఎంత‌కు తెగించాడో...

శ్రీదేవి మీద పిచ్చి ప్రేమ‌తో ఆ దుబాయ్ షేక్ ఎంత‌కు తెగించాడో తెలుసా.. మ‌తులు పోవాల్సిందే..!

దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి అంటే అప్పట్లో ఎంతో మంది కలల ఆరాధ్య దేవత. శ్రీదేవిని వెండితెర మీద చూసేందుకు సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులు వెర్రెక్కిపోయి ఉండేవాళ్లు. అసలు ఆమెను తేర మీద చూసేందుకే ఆమె కోసమే సినిమాకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య కోట్లలో ఉండేది. అటువైపు ఎంత పెద్ద స్టార్ హీరో ఉన్నా కూడా శ్రీదేవి సినిమాలో ఉంటే చాలు ఆ సినిమాకు తిరుగులేని క్రేజ్‌ ఉండేది.

ఆ తర్వాత ఆమె బాలీవుడ్కుడ్‌కు వెళ్ళాక కూడా అంతే క్రేజ్‌ తెచ్చుకుంది.శ్రీదేవి ఉంటే ఆ సినిమాకు టికెట్లు బాగా తెగేవి ..అప్పట్లో శ్రీదేవిని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు, కన్నడ ప్రేక్షకులు పని కట్టుకుని చెన్నై వెళ్లి ఆమె ఇంటి ముందు పడుకో పడిగాపులు పడేవారు. శ్రీదేవి సినిమా షూటింగుకు వెళ్లేటప్పుడు బయటకు వచ్చి అలా చేయి ఊపి హాయ్ చెబితే అదే గొప్ప సంతోషంగా ఫీల్ అయ్యేవారు.

అలా ఆమెను ఒక్కసారి చూసేందుకే చెన్నై వెళ్లేవారు.. అంటే ఆమె పట్ల ఎంత పిచ్చి ప్రేమతో ఉండేవారు తెలుస్తోంది.ఆమెపై పిచ్చి ప్రేమ పెంచుకున్న ఒక దుబాయ్ షేక్ అయితే ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి శ్రీదేవి తల్లి రాజేశ్వరిని కలిసి శ్రీదేవితో మాట్లాడించమని చెప్పాడట. అప్పుడు శ్రీదేవి తల్లి చెన్నై నడిబొడ్డున ఉన్న సరస్వతి మహల్ తో పాటు నాలుగు వేల గజాల స్థలం కొని శ్రీదేవి పేరున పెట్టి డాక్యుమెంట్లు తెస్తే శ్రీదేవితో మాట్లాడిస్తానని చెప్పిందట.

ఆ వెంటనే ఆ దుబాయ్ షేక్ 4000 గజాల స్థలంతో పాటు అందులో ఉన్న సరస్వతి మహల్ ప్యాలెస్ ను కొని శ్రీదేవికి రిజిస్టర్ చేయించి ఆ డాక్యుమెంట్లు తెచ్చి శ్రీదేవి తల్లి రాజేశ్వరి చేతిలో పెట్టాడట. అప్పుడు కానీ ఆమె శ్రీదేవితో ఆ దుబాయ్ షేక్ ను మాట్లాడమని చెప్పిందట అంటే శ్రీదేవి పట్ల ప్రేక్షకులు ఎంత వెర్రి అభిమానంతో ఉంటారో చెప్పేందుకు ఈ సంఘటన పెద్ద ఉదాహరణగా అప్పట్లో గొప్పగా చెప్పుకునేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news