Moviesఆ మోజులో ప‌డి కెరీర్‌ను దెబ్బ‌తీసుకున్నాను.. జాన్వీ సంచ‌ల‌న కామెంట్స్‌

ఆ మోజులో ప‌డి కెరీర్‌ను దెబ్బ‌తీసుకున్నాను.. జాన్వీ సంచ‌ల‌న కామెంట్స్‌

దివంగ‌త అతిలోక అందాల సుంద‌రి శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ ఎట్ట‌కేల‌కు సౌత్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ దేవ‌ర సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. కొర‌టాల శివ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. తాను మ‌రింత వైవిధ్యం ఉన్న క‌థ‌ల‌లో న‌టించాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పింది.

ఈ క్ర‌మంలోనే త‌న న‌ట‌న‌ను మ‌రింత‌గా మెరుగు ప‌రుచుకునేందుకు.. విల‌క్ష‌ణ న‌టిగా ఫ్రూవ్ చేసుకునేందుకు ఆరాట ప‌డుతున్న‌ట్టు త‌న తాజా ఇంట‌ర్వ్య‌లో చెప్పింది. నా కెరీర్ ప‌ట్ల తాను సంతృప్తిగా ఉన్నాన‌ని.. సంప్ర‌దాయ పాత్ర‌ల‌తో పాటు అసాధార‌ణ‌మైన ప్ర‌జాదార‌ణ పొంద‌గ‌ల‌న‌ని త‌న‌కు తెలుసు అని.. న‌టిగా నా ప‌రిధిని విస్త‌రించ‌డంతో పాటు న‌ట‌నా సామ‌ర్థ్యాల‌ను ప‌రీక్షించుకునేందుకు స‌వాల్ చేసే పాత్ర‌ల‌ను ఎంచుకోవాల‌ని ఉన్న‌ట్టు చెప్పింది.

బాధ‌లు, ఏడుపు క్యారెక్ట‌ర్ల‌లో మెప్పించాను అని భావిస్తున్నాను.. అందుకే ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా ఆక‌ర్షించే ప్ర‌యోగాలు చేయాల‌నుకుంటున్న‌ట్టు జాన్వీ తెలిపింది. ముఖ్యంగా కామెడీ క్యారెక్ట‌ర్ల కోసం వెయిట్ చేస్తున్నా… స్క్రీన్ పై డ్యాన్స్ చేస్తూ.. అందంగా క‌నిపిస్తున్నా… ఎక్క‌డో స‌హ‌జ‌మైన న‌ట‌న మిస్ అవుతున్న ఫీలింగ్ క‌లుగుతోంది.. అంటూ ప‌లు విష‌యాలు షేర్ చేసుకుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news