Newsఒక్క గుడ్ న్యూస్..ఒక్క బ్యాడ్ న్యూస్.. మింగలేక కక్కలేని పోజీషన్ లో...

ఒక్క గుడ్ న్యూస్..ఒక్క బ్యాడ్ న్యూస్.. మింగలేక కక్కలేని పోజీషన్ లో అనుష్క ఫ్యాన్స్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో జేజమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి త్వరలోనే ఇండస్ట్రీకి టాటా బై బై చెప్పేస్తుందా ..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు.. సినీ విశ్లేషకులు . చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క శెట్టి తన వద్దకు వచ్చిన మంచి మంచి కథలను రిజెక్ట్ చేస్తుందట. పెద్ద డైరెక్టర్ లు అయినా కధ వినకుండానే నో అంటూ చెప్పి పంపించేస్తుందట .

కాగ ప్రభాస్ మీద ఉండే అభిమానంతో ఎట్టకేలకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాను సైన్ చేసి షూటింగ్ కంప్లీట్ చేసుకుని త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . కాగా అఫీషియల్ డేట్ ప్రకారం ఆగస్టు 4న ఈ సినిమా రిలీజ్ అవ్వాలి .. అయితే ఈ సినిమా వాయిదా పడినట్లు తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో అనుష్క శెట్టి కి సంబంధించిన మరో న్యూస్ వైరల్ గా మారింది . అనుష్క శెట్టి చేసే లాస్ట్ సినిమా ఇదే అని ..ఆ తర్వాత అనుష్క శెట్టి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకోబోతుంది అని ..ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అసలు కనిపించదని సోషల్ మీడియా కి సైతం దూరంగా ఉండబోతుంది అని ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే అనుష్క శెట్టి వాళ్ళ అమ్మానాన్న చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిందట. ప్రభాస్ ఇంకా సింగిల్గానే ఉండడంతో అనుష్క శెట్టి తన పేరెంట్స్ ను బాధ పెట్టకూడదని ఇలాంటి నిర్ణయం తీసుకుందట . దీంతో అనుష్క ఫ్యాన్స్ డీలా పడిపోతున్నారు. అనుష్క పెళ్లి చేసుకోవడం ఓ గుడ్ న్యూస్ అయినా ఇలా సినిమాలకి గుడ్ బై చెప్పడం బ్యాడ్ న్యూస్ గా భావిస్తున్నారు . అంతేకాదు అనుష్క – ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటే చూడాలి అన్నది కోట్లాదిమంది అభిమానుల కోరిక .. ఆ కోరిక కూడా తీరని కోరికగానే మిగిలిపోతూ ఉండడం ఇప్పుడు అభిమానులకి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో సోషల్ మీడియాలో అనుష్క శెట్టి ఫ్యాన్స్ ప్రభాస్ ని పెళ్లి చేసుకోమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. చూద్దాం మరి అనుష్క దీనిపై ఎలా నోరు విప్పుతుందో ..లేక సైలెంట్ గా పెళ్లి చేసుకుని గుడ్ న్యూస్ ని మనకు అందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news