Moviesఅయ్యయ్యో.. "ముందు చూస్తే నుయ్యి-వెనుక చూస్తే గొయ్యి"..జాన్వీ పాపకి ఎంత కష్టం...

అయ్యయ్యో.. “ముందు చూస్తే నుయ్యి-వెనుక చూస్తే గొయ్యి”..జాన్వీ పాపకి ఎంత కష్టం వచ్చిందో..?

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురుగా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వికపూర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతోనే హాట్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్ కొట్టలేదు. కానీ స్టార్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతుంది . దానికి మెయిన్ రీజన్ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చేసే హాట్ హాట్ ఫోటోషూట్స్ అనే చెప్పాలి .

కాగా తెలుగులో కూడా అమ్మడు డెబ్యూ ఇవ్వడానికి సిద్ధపడింది . ఎన్టీఆర్ “దేవర” సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది . ఈ సినిమా కోసం అమ్మడు ఏకంగా నాలుగు కోట్లు చార్జ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇలాంటి క్రమంలోనే జాన్వికపూర్ కి కొత్త సమస్య వచ్చి పడినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కరోనా మన జీవితాల్లోకి రాకముందు వరకు ఏ సినిమా అయినా మనం థియేటర్లోకి వెళ్లి చూసేవాళ్ళం. అయితే ఎప్పుడైతే ఓటిటి కల్చర్ పెరిగిపోయిందో అప్పట్నుంచి పరిస్థితి మొత్తం తారుమారు అయిపోయింది.

థియేటర్స్ కి వచ్చి ఆడియన్స్ సినిమా చూడ్డానికి ఇష్టపడడం లేదు. ఇంట్లోనే కూర్చుని హ్యాపీగా ఫీలిం చూడ్డానికి ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో సినిమా ఇండస్ట్రీ అతలాకుతలం అవుతుంది. మిగతా వాళ్ళ సంగతేమో గాని జాన్వి కపూర్ మాత్రం ఓటిటి స్టార్ అని అంటుంది . ఎందుకంటే ఇప్పటివరకు 6 చిత్రాలు చేస్తే అందులో మూడు ఓటిటిలోనే రిలీజ్ అయ్యాయి.

జాన్వి చేసిన వాటిలో గోస్ట్ స్టోరీస్ లో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది .ఇప్పుడు వరుణ్ ధావన్ తో కలిసిన సినిమా నేరుగా ఓటిటిలోకి రాబోతుంది . ఈ క్రమంలోనే జాన్వికి కొత్త టెన్షన్ మొదలైంది . ఎందుకంటే ఓటిటిలో రిలీజ్ అయిన ప్రతి సినిమా డిజాస్టర్ గానే మారింది. ఒకవేళ నిజంగా ఈ సినిమా డిజాస్టర్ గా మారితే ఆ ప్రభావం దేవర సినిమాపై ఖచ్చితంగా ఉంటుంది . తద్వారా తెలుగులో అవకాశాలు తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో ఓటీటీ పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది జాన్వీకి అన్న కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news