MoviesTarakaratna తారకరత్నతో ఉన్న చివరి తీపి గుర్తును షేర్ చేసిన...

Tarakaratna తారకరత్నతో ఉన్న చివరి తీపి గుర్తును షేర్ చేసిన అలేఖ్య రెడ్డి.. ఫ్యాన్స్ కి కన్నీరు తెప్పిస్తున్న స్వీట్ మూమెంట్..!!

అతి చిన్న వయసులోనే టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న మరణించడం ఫాన్స్ కు మింగుడు పడడం లేదు. మరి ముఖ్యంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి ఇంకా నందమూరి తారకరత్న బ్రతికే ఉన్నాడు అంటూ ఊహించుకుంటుంది . ఈ క్రమంలోనే రీసెంట్గా అలేఖ్య రెడ్డి తన భర్తతో దిగిన ఆకరి ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది . మనకు తెలిసిందే నందమూరి హీరోగా పేరు సంపాదించుకున్న తారకరత్న 23 రోజుల పాటు మరణంతో సుదీర్ఘంగా పోరాడి అలసిపోయి తనువు చాలించాడు. ఆయన మరణ విషయాన్ని ఇంకా తెలుగు రాష్ట్రాలు మర్చిపోలేక పోతున్నాయి .

ఈ క్రమంలోని అలేఖ్య రెడ్డికి నందమూరి ఫ్యామిలీకి అభిమానులు అండగా నిలుస్తున్నారు . అయితే తన భర్తతో దిగిన ఆఖరి జ్ఞాపకాన్ని అవమానులతో షేర్ చేసుకున్న అలేఖ్య రెడ్డి.. కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది . సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అలేఖ్య రెడ్డి.. తాజాగా చేసిన పోస్ట్ అందరి హృదయాలని కలచివేస్తుంది. తారకరత్నతో చివరిగా దిగిన ఫోటోలు అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది . మనకు తెలిసిందే రీసెంట్గా నందమూరి తారకరత్న కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు.

ఆ టైంలోనే తన కూతుర్ని, భార్యను, కొడుకును మీడియాకు పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే చివరగా తిరుమల కి వెళ్ళినప్పుడు ఆలయం వద్ద తారకరత్న -అలేఖ్య రెడ్డి తమ ముగ్గురు పిల్లలతో దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి తన భర్తతో ఉన్న స్వీట్ మెమోరీస్ మరోసారి గుర్తు చేసుకుంది . “ఇదే మా చివరి ఫోటో అని తలుచుకుంటుంటే నా హృదయం ముక్కలు అయిపోతుంది ..ఇదంతా కల అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది.. నీ వాయిస్ తో అమ్మ బంగారు అంటూ లేపవా “అంటూ ఎంతో బాధగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది . దీంతో తారకరత్న ఫ్యాన్స్ ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news