Moviesఆ ఒక్క పదం తో ..రష్మిక కి 90MM రాడ్ దించేసిన...

ఆ ఒక్క పదం తో ..రష్మిక కి 90MM రాడ్ దించేసిన రిషిబ్ శెట్టి.. మరోసారి సంచలన కామెంట్స్.. !!

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. కన్నడ స్టార్ డైరెక్టర్ కం నటుడు రిషిబ్ శెట్టి పేర్లు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమే. రష్మిక ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ రిషిబ్ సెట్టినే. కిర్రాక్ పార్టీ సినిమా అప్పట్లో సెన్సేషన్ హిట్టుగా మారింది . అంతేకాదు ఈ సినిమాలో రష్మిక నటనకు పాజిటివ్ కామెంట్స్ దక్కాయి . అయితే ఆ సినిమా టైంలో వాళ్ళిద్దరి మధ్య వచ్చిన వివాదాలు కారణంగా రష్మిక అతగాడిని దూరం పెడుతూ వచ్చింది.

అంతేకాదు రీసెంట్గా రిలీజ్ అయిన కాంతారా సినిమాను చూశారా ..? అంటూ రష్మికని ని మీడియా ప్రశ్నించగా ..చూడలేదు అంటూ ముఖానే చెప్పేసింది. దీంతో మండిపోయిన రిషిబ్ శెట్టి ..రష్మిక ని పరోక్షంగా టార్గెట్ చేస్తూ వచ్చారు. పలు ఇంటర్వ్యూలో ఆమెను టార్గెట్ చేస్తూ గట్టిగా ఇచ్చిపడేశాడు . ఇప్పటికే సమంత, సాయి పల్లవి, రష్మిక తో సినిమా చేస్తారంటే ఎవ్వరికి ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే..పరోక్షంగా సమంత సాయి పల్లవి తో సినిమా చేస్తానని రష్మిక పేరును ప్రస్తావించనేలేదు .

అంతేకాదు ఈ మధ్యనే కిర్రాక్ పార్టీ రిలీజ్ అయిన ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరినీ ట్యాగ్ చేస్తూ హీరోయిన్ రష్మిక మందనను లైట్గా తీసుకున్నారు. కాగా రీసెంట్గా మరోసారి ప్రముఖ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మందన పై పరోక్షకంగా కామెంట్ చేశాడు రిషబ్ శెట్టి . ఇటీవల మ్యాషబుల్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యులో మాట్లాడుతూ ..”మేము ఎంతో మంది ఆర్టిస్టులను లాంచ్ చేసాము.. చాలామంది దర్శకులు, నిర్మాతలు మాకు అవకాశాలు ఇచ్చారు . వాళ్ళని ఎప్పుడు మేము గుర్తు పెట్టుకుంటాం . అలాంటివారి లిస్ట్ మా దగ్గర ఎక్కువగానే ఉంటుంది. వాళ్లకి ఎప్పుడు మేము గౌరవం ఇస్తూనే ఉంటాము” అంటూ పరోక్షకంగా రష్మిక మందన -రిషిబ్ శెట్టి ని అవాయిడ్ చేస్తున్న మేటర్ ను లేవదీశారు . ఏది ఏమైనా సరే నేషనల్ క్రష్ లాంటి స్టార్ హీరోయిన్ పై ఇలాంటి కామెంట్స్ చేసి ఆమెకు 90 ఎంఎం రాడ్ దించేశాడు అంటూ జనాలు రిషిబ్ శెట్టి మాటలను ట్రెండ్ . చూడాలి ఈ వివాదం ఎప్పుడు సర్దుమనుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news