Moviesవామ్మో..ఏంటి ఇది వరలక్ష్మి నందమూరి ఫ్యాన్స్ ని.. అంత మాట అనేసింది..?

వామ్మో..ఏంటి ఇది వరలక్ష్మి నందమూరి ఫ్యాన్స్ ని.. అంత మాట అనేసింది..?

వరలక్ష్మి శరత్ కుమార్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు . మల్టీ టాలెంటెడ్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కుమార్తె . ఈ వరలక్ష్మి సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ అయిపోదామని బోలెడన్ని ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత కొన్ని సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలు పెద్దగా ఆమె కు కలిసి రాకపోవడంతో .. తన బాడీ లాంగ్వేజ్ హీరోయిన్ పాత్రలకు సూట్ అవ్వదు అంటూ గ్లామరస్ రోల్ కి నేను పనికిరాని అంటూ ఆమె స్వయంగా విలన్ గా మారింది .

మన ఇండస్ట్రీలో లేడీ విలన్స్ చాలా తక్కువ . ఈ క్రమంలోని వరలక్ష్మి శరత్ కుమార్ ఆ విషయాని క్యాష్ చేసుకొని రాణిస్తుంది . ఆమె నటించిన క్రాక్ సినిమా ఎంతటి పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే . హీరో రవితేజ కన్నా హీరోయిన్ శృతిహాసన్ , కన్నా జయమ్మ క్యారెక్టర్ గా వరలక్ష్మి చేసిన పర్ఫామెన్స్ జనాలకు బాగా ఎక్కేసింది. ఈ క్రమంలోనే రీసెంట్గా నందమూరి బాలయ్య హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాలోని ఆఫర్ అందుకొని అదిరిపోయే బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

రీసెంట్గా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ ..” ఈ సినిమా షూట్ లోనే చాలా భయపడ్డానని.. ఇంటర్వెల్ సీన్ లో నేను బాలయ్యను చంపేసిన స్సిన్ అప్పుడు ఎక్కడ నన్ను బాలయ్య ఫ్యాన్స్ రోడ్డుపై కనిపడితే నరికేస్తారేమో అంటూ భయపడిపోయానని చెప్పుకొచ్చింది”. నిజానికి వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పినట్లే ఆ సీన్ చూస్తున్నప్పుడు థియేటర్లో నందమూరి ఫ్యాన్స్ వరలక్ష్మి పై మండిపడ్డారు . “నిన్ను ఎంతో ప్రేమగా చెల్లమ్మ అంటూ అనుకున్న బాలయ్యను అలా చంపేస్తావా.. సిగ్గులేని దాన అంటూ ఎంతో మంది థియేటర్స్ లో ఆమెను బూతులు తిట్టుకున్నారు . అంత హెడ్ వెయిట్ గల ఆడపిల్ల అంటూ ముసలోలు సైతం ఆమెపై మండిపడ్డారు”. అయితే అదంతా సినిమాలో భాగమే ..ఆ విధంగా ఆమె నటించి జనాలను మెప్పించింది . ఏది ఏమైనా సరే రాబోయే రోజుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఇండస్ట్రిని ఏలేసే లేడీ విలన్ అవుతుంది అనడంలో సందేహమే లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news