Moviesబాలీవుడ్ చనిపోవడానికి కారణం వాళ్ళే..రకుల్ ప్రీత్ కాంట్రవర్షీయల్ కామెంట్స్..!!

బాలీవుడ్ చనిపోవడానికి కారణం వాళ్ళే..రకుల్ ప్రీత్ కాంట్రవర్షీయల్ కామెంట్స్..!!

ఈ మధ్యకాలంలో సౌత్ తో కంపేర్ చేస్తే నార్త్ సినిమాలు వరుసగా డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంటున్నాయి . మరి ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ టైం నుంచి నార్త్ సినిమాలు పెద్దగా హిట్ అవడం లేదు . ఏదో ఒకటి రెండు సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయే తప్పిస్తే.. మిగతా సినిమాలన్నీ డిజాస్టర్ గా మారాయి. మరీ ముఖ్యంగా సౌత్ లోని సినిమాలు బాలీవుడ్ లో హిట్ కొట్టడం సంచలనంగా మారింది .

ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరో సౌత్ హీరోస్ మధ్య ఫుల్ వార్ జరుగుతుంది. కాగా ఇలాంటి మూమెంట్లోనే రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్గా ఇంటర్వ్యూ కి అటెండ్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ ..బాలీవుడ్ సౌత్-నార్త్ సినిమాల గురించిన ప్రశ్న ఎదురయింది . ఈ క్రమంలోనే రకుల్ ప్రీత్ సింగ్ రెస్పాండ్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది .

రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ..” నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ మాటలు వింటూనే ఉన్నాను . సౌత్, బాలీవుడ్ ను చంపేసింది.. సౌత్ సినిమాలు వల్ల బాలీవుడ్ ఎదగలేక పోతుంది అంటూ కొందరు చెప్పుకొస్తున్నారు . బాలీవుడ్ పనైపోయింది.. ఇక బాలీవుడ్ ఎదగలేదు ఇండస్ట్రీకి ఇక సౌత్ ఫిలిం సే ప్రాణం పోయాలి అంటూ చెప్పకు వస్తున్నారు. అది నేను ఎప్పటికీ ఒప్పుకోను.. సినిమా ఎక్కడైనా సినిమానే అది నార్త్ కాదు సౌత్ కాదు. ఏ సినిమా హిట్ అయిన దానికి మూల కారణం నటీనటులే వాళ్ళ కష్టపడితేనే సినిమా హిట్ అవుతుంది.

అది నార్త్ వాళ్ళు కాదు సౌత్ వాళ్ళు కాదు ఎవరైనా సరే మంచి కథ టాలెంట్ కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమా అయినా హీట్ అవుతుంది . అంతే కొన్నిసార్లు అలా ఇలా బ్రేక్స్ పడొచ్చు కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అన్ని ఇండస్ట్రీలు కలిసిపోతాయి .. ఈలోపు ఇలాంటి మాటలు మాట్లాడటం టైం వేస్ట్ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకోచ్చారు. దీంతో సౌత్ జనాలు గుర్రుగా ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పరోక్షకంగా బాలీవుడ్ ను వెనకేసుకొచ్చిందని ఆమెకు సౌత్ లో ఇక సినిమా ఛాన్స్ ఇవ్వకూడదు అంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా సరే రకుల్ ప్రీత్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news