Moviesతీవ్ర విషాదం: శోకసంద్రంలో యాంకర్ అనసూయ..కన్నీరు పెట్టుకున్న ఫ్యాన్స్..!!

తీవ్ర విషాదం: శోకసంద్రంలో యాంకర్ అనసూయ..కన్నీరు పెట్టుకున్న ఫ్యాన్స్..!!

టాలీవుడ్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ వెండి తెర పై పలు రోల్స్ తో మెప్పిస్తూ.. యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాగా వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ..ఈ మధ్యకాలంలో అనుకోని వివాదాల్లో ఇరుక్కుంటూ..ట్రోల్ అవుతుంది.

రీసెంట్ గా అనసూయ పెట్టిన పోస్ట్ అభిమానులను కలచి వేస్తుంది . స్టార్ యాంకర్ అనసూయ రీసెంట్గా మరణించిన దర్శకనిర్మాత మదన్ మరణం పై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఎమోషనల్ అయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ తన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేసింది . అంతేకాదు ఆయనతో అనసూయ కు ఉన్న రిలేషన్షిప్ పై ఓపెన్ అప్ అవుతూ ..ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.

“నేను జర్నలిస్టుగా నటించిన గాయత్రి చిత్రానికి ఆయన దర్శకులు. సహనం ఓపిక మంచితనానికి మరో మారుపేరు ఆయన . చాలా దయగల వ్యక్తి . ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను “అంటూ పోస్ట్ చేసింది. కాగా తెలుగు జనాలకు మదన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పెళ్లయిన కొత్తలో సినిమా తో దర్శకుడిగా మారాడు . గుండెఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, గరం చిత్రాలకు దర్శకుడిగా ,రచయితగా పనిచేశారు . అంతేకాదు తెలుగు సినిమాలకు నిర్మాతగా కూడా చేశాడు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కి గురైన్నట్లు తెలుస్తుంది. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు . దీంతో మదన్ మృతికి చిత్ర ప్రముఖులు ,స్టార్ సెలబ్రిటీస్ ..విచారం వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన ఫ్యాన్స్ కన్నీరుగా మున్నీరు గా వినిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news