Moviesఎన్టీఆర్‌ను క‌మ‌ర్షియ‌ల్‌గా వాడుకుంటోన్న రాజ‌మౌళి... బాగా దువ్వుతున్నాడుగా...!

ఎన్టీఆర్‌ను క‌మ‌ర్షియ‌ల్‌గా వాడుకుంటోన్న రాజ‌మౌళి… బాగా దువ్వుతున్నాడుగా…!

రాజ‌మౌళికి ఏ సినిమా విష‌యంలో అయినా ఎలా మార్కెట్ చేసుకోవాలి ? క‌మ‌ర్షియ‌ల్‌గా ఎలా త‌న సినిమాకు మంచి వ‌సూళ్లు రాబ‌ట్టుకోవాల‌న్న‌ది బాగా తెలుసు. అందుకే త్రిబుల్ ఆర్ సినిమా యావ‌రేజ్ కంటెంట్‌తో ఉన్నా కూడా ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉన్నా.. అంత దమ్మున్న క‌థ లేక‌పోయినా కేవ‌లం త‌న మార్కెటింగ్ నైపుణ్యంతోనే ఈ సినిమాకు ఈ స్థాయిలో వ‌సూళ్లు వ‌చ్చేలా చేసుకున్నాడు.

అలా రాజ‌మౌళి స్ట్రాట‌జీతోనే త్రిబుల్ ఆర్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏదోలా గ‌ట్టెక్కేసింది. ఇక ఇప్పుడు రాజ‌మౌళి ఓ బాలీవుడ్ సినిమాను ప్ర‌మోట్ చేసే బాధ్య‌త భుజాన‌కెత్తుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్లు రణబీర్ కపూర్, ఆలియా భట్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా బ్ర‌హ్మాస్త్ర‌. ఈ సినిమా తెలుగులో బ్ర‌హ్మాస్త్రం పేరుతో రిలీజ్ అవుతోంది. అయాన్ ముఖ‌ర్జీ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు.

ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా కీల‌క పాత్రలో న‌టించారు. ఈ సినిమాను తెలుగులో ప్ర‌మోష‌న్స్ చేసే విష‌యంలో మేక‌ర్స్ ఎక్క‌డా రాజీప‌డ‌డం లేదు. అటు నాగార్జున ఎలాగూ ఉండ‌నే ఉన్నాడు. ఇక రాజ‌మౌళి అండ‌దండ‌లు ఉండ‌నే ఉన్నాయి. రాజ‌మౌళికి ఈ సినిమాలో వాటా ఉంద‌నే టాక్ ఉంది. అందుకే రాజ‌మౌళి ఈ సినిమాకు తెలుగులో హైప్ తీసుకు వ‌చ్చేందుకు అదిరిపోయే క‌మ‌ర్షియ‌ల్ ప్లాన్ వేసిన‌ట్టే ఉంది.

బ్ర‌హ్మాస్త్రంకు తెలుగులో గ్రాండ్ ప్రి రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్ సెప్టెంబ‌ర్ 2న హైద‌రాబాద్‌లో జ‌ర‌గ‌బోతోంది. దీనికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడు. ఈ విష‌యాన్ని మేకర్స్ క్రేజీ వీడియోతో అనౌన్స్ చేశారు. రాజ‌మౌళి ఎన్టీఆర్‌ను దువ్వి మ‌రీ బ్ర‌హ్మాస్త్రంకు తెలుగులో హైప్ తీసుకు వ‌చ్చే ప్లాన్ చేస్తున్న‌ట్టే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news